Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- ప్రాజెక్టుపై ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేసిన భట్టి
- బీజేపీ వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాండ్
- కేంద్రం, మహారాష్ట్ర నుంచి అనుమతులు తేవాలని సూచన
- భూమి ఆకాశాలు ఒకటైనా ప్రాజెక్టు కడతామన్న భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అసలు ఈ ప్రాజెక్టును కడదామా? వద్దా? అనే దానిపై బీజేపీ సభ్యులు తమ స్పష్టమైన వైఖరిని చెప్పాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శాసనసభలో ఎల్లీ నో ప్రభావం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యల గురించి జరుగుతున్న చర్చలో భాగంగా బీజేపీ సభ్యులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి అంశం లేవనెత్తడంతో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లందించాలనే ఆలోచనతో తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని భట్టి గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టి, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శించారు. తెలంగాణకు ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్ట్ విషయంలో అటు బిఆర్ఎస్, ఇటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని మండిపడ్డారు.
అనుమతుల కోసం కేంద్రాన్ని, మహారాష్ట్రను ఒప్పించండి
బీజేపీ నాయకులు తమ ప్రాభవాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర జలశక్తి శాఖను, పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు తీసకురావాలని కోరారు. సభ్యుడు హరీష్ రావు ఇచ్చిన సలహాను తాము సానుకూలంగా స్వీకరించి ప్రాజెక్ట్ కడతామని చెప్పామని, బీజేపీ సభ్యులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెస్తామని అంటారని ఆశించామని భట్టి చెప్పారు. అయితే మైక్ ఇవ్వగానే ప్రధాన విషయాన్ని వదిలేసి వేరే అంశాల్లోకి వెళ్లిపోయారని ఆక్షేపించారు. ”ఇప్పుడు మన ముందున్న ప్రధాన ప్రశ్న… తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడదామా? వద్దా? బీజేపీ సహకరిస్తుందా? లేదా? స్పష్టంగా చెప్పాలి. మీరు సహకరించినా, సహకరించకపోయినా మా ప్రభుత్వం మాత్రం భూమి ఆకాశాలు ఒకటైనా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించే తీరుతుంది” అని భట్టి విక్రమార్క సభలో స్పష్టం చేశారు.
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..