Yoga Mahotsav: రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలి.. యోగా మహోత్సవ్ లో గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yoga Mahotsav: ఇక్కడి కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, ముంజ్ పరా మహేంద్ర బాయ్, గవర్నర్ తమిళ్ సై, సినిమా ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్టమస్ లాగానే యోగా దినోత్సవం పండుగ లాగా చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి ఇల్లాళ్ళు అందరూ యోగా చేయాలన్నారు. ఈ యోగా టెన్షన్ లను దూరం చేస్తుందని పేర్కొన్నారు. యోగ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. యోగా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసిన ప్రధాని మోడీ కి ధన్యవాదాలన్నారు. ఇక్కడి నుంచి నినాదాలు చేస్తే ఢిల్లీలో ఉన్న నరేంద్రమోదీ కి వినిపించాలని కోరారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని అన్నారు.
Read also: Astrology : మే 27, శనివారం దినఫలాలు
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కు ముందు కౌంట్ డౌన్ గా ఈ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. యావత్ ప్రపంచంలోనే ఏకైక కార్యక్రమం ఈ యోగా మహోత్సవ్ అని అన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జూన్ 21 న ప్రతి ఒక్కరు ఇండ్లలో, కాలనీల్లో, గ్రామాల్లో యోగా చేయాలన్నారు. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 రోజుల కౌంట్ డౌన్ తో యోగ మహోత్సవ్ జరుగుతుందని తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం సిద్ధం చేయడం కోసం యోగా మహోత్సవ్ అన్నారు. యోగ మహోత్సవ్ కార్యక్రమం ప్రపంచంలో నే మొదటిసారిగా హైదరాబాద్ లో జరుగుతుందన్నారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డే 100 రోజులకు ముందే కార్యక్రమం ఏర్పాట్లకు శ్రీకారం అన్నారు. 100 రోజులకు ముందు ఢిల్లీ, 75 రోజులు మందు అస్సాం, 50 రోజులకు ముందు జైపూర్లో, 25 రోజుల ముందు ఇప్పుడు హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ జరుపుకుంటున్నామని తెలిపారు. వచ్చే 25 రోజులు జూన్ 21 యోగా డేకు సిద్ధం చేయడం కోసం పరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యోగాతో సంబంధం ఉన్న108 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సారి యోగా థీమ్ వసుదైక కుటుంబమని పేర్కొన్నారు.
Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!