Yoga Mahotsav: రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలి.. యోగా మహోత్సవ్ లో గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yoga Mahotsav: ఇక్కడి కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, ముంజ్ పరా మహేంద్ర బాయ్, గవర్నర్ తమిళ్ సై, సినిమా ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్టమస్ లాగానే యోగా దినోత్సవం పండుగ లాగా చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి ఇల్లాళ్ళు అందరూ యోగా చేయాలన్నారు. ఈ యోగా టెన్షన్ లను దూరం చేస్తుందని పేర్కొన్నారు. యోగ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. యోగా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసిన ప్రధాని మోడీ కి ధన్యవాదాలన్నారు. ఇక్కడి నుంచి నినాదాలు చేస్తే ఢిల్లీలో ఉన్న నరేంద్రమోదీ కి వినిపించాలని కోరారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని అన్నారు.
Read also: Astrology : మే 27, శనివారం దినఫలాలు
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కు ముందు కౌంట్ డౌన్ గా ఈ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. యావత్ ప్రపంచంలోనే ఏకైక కార్యక్రమం ఈ యోగా మహోత్సవ్ అని అన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జూన్ 21 న ప్రతి ఒక్కరు ఇండ్లలో, కాలనీల్లో, గ్రామాల్లో యోగా చేయాలన్నారు. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 రోజుల కౌంట్ డౌన్ తో యోగ మహోత్సవ్ జరుగుతుందని తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం సిద్ధం చేయడం కోసం యోగా మహోత్సవ్ అన్నారు. యోగ మహోత్సవ్ కార్యక్రమం ప్రపంచంలో నే మొదటిసారిగా హైదరాబాద్ లో జరుగుతుందన్నారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డే 100 రోజులకు ముందే కార్యక్రమం ఏర్పాట్లకు శ్రీకారం అన్నారు. 100 రోజులకు ముందు ఢిల్లీ, 75 రోజులు మందు అస్సాం, 50 రోజులకు ముందు జైపూర్లో, 25 రోజుల ముందు ఇప్పుడు హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ జరుపుకుంటున్నామని తెలిపారు. వచ్చే 25 రోజులు జూన్ 21 యోగా డేకు సిద్ధం చేయడం కోసం పరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యోగాతో సంబంధం ఉన్న108 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సారి యోగా థీమ్ వసుదైక కుటుంబమని పేర్కొన్నారు.
Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తాజావార్తలు
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?