మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిం చేందుకు మార్గదర్శకాలనను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూని ట్గా చేసుకుని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ కేటాయింపుల కోసం నేతృత్వంలో నలుగురు సభ్యు లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా జిల్లా ఎక్సైజ్ అధికారి,గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఉంటారు. డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయిం చనున్నారు. ఈ ప్రక్రియను తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయా లని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
నూతన పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గౌడ్లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం దుకాణా లు కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా లో జనాభా ప్రాతిపదికన లాటరీ ద్వారా కేటాయిస్తారు. దరఖాస్తు రుసు ము గతంలో లాగానే రూ. 2ల క్షలుగా రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిం ది. దుకాణాల కేటాయింపుల్లో పాత స్లాబులనే అనుసరించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. లైసెన్స్లు పొందిన వారు ఏడాదికి ఒకసారి లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
లైసెన్స్ ఫీజులు ఇలా..
5వేల జనాభా వరకు 50 లక్షలు, 5వేల నుంచి50 వేలరకు జనాభా ఉంటే రూ.55లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే 60 లక్షలు లైసెన్స్ ఫీజు కట్టాలి. లక్ష నుంచి5లక్షల వరకు జనాభా ఉంటే 65లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల వరకు జనాభా ఉంటే రూ.85లక్షలు, 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో ఫీజు కోటి పదిలక్షలుగా నిర్ణయించారు.