Bonalu: నేటినుంచి ఆషాఢ బోనాలు.. గోల్కొండ జగదాంబకు తొలిబోనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల ఉత్సవాలతో నగరంలో బస్తీలు, కాలనీలు కళకళలాడుతాయి. భక్తులు తమ ఇష్టదైవానికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. హైదరాబాద్ లో తొలి బోనం గురువారం చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి సమర్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. ఇవాల్టి నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు తొమ్మిదివారాల (గురు,ఆదివారాలు)పాటు ఆషాఢమాస బోనాలను చారిత్రక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో దేవాదాయ శాఖ ఘనంగా నిర్వహించనుంది. బోనాలు ఉత్సవాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు లంగర్హౌస్ చౌరస్తాలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈనేపథ్యంలో లంగర్హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి పట్టువస్త్రాలు.. తొట్టెల ఊరేగింపుతో జాతర ప్రారంభం అవుతుంది. బోనాల నేపథ్యంలో.. గోల్కొండ జగదాంబికకు 9 వారాల పూజల సందర్భంగా గోల్కొండ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే.. ఈ ఆంక్షలు పూజలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయి.
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
కాగా.. రాందేవ్గూడ టు గోల్కొండ కోట వయా మక్కీదర్వాజ, లంగర్హౌస్ టు గోల్కొండ వయా ఫతేదర్వాజ, షేక్పేట నాలా, సెవెన్టూంబ్స్ టు గోల్కొండ కోట వయా బంజారాదర్వాజ మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి బోనాలు అంతగా జరగకపోవడంతో.. ఈసారి పూర్తిస్థాయిలో గోల్కొండ బోనాల జాతర జరుగుతుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జగదాంబిక అమ్మవారికి ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్ తెలిపారు.
Breaking: తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు.. 8 మంది సజీవదహనం
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?