Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Godavari River A Polluted Confluence Of Drains In Bhadrachalam

గోదారమ్మను కాటేస్తున్న కాలుష్యం

Published Date :January 22, 2022 , 6:12 pm
By NTV WebDesk
గోదారమ్మను కాటేస్తున్న కాలుష్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందిస్తున్న మహానది గోదావరి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందా? భద్రాచలం వద్ద గోదావరి కాలుష్య కాసారంగా తయారైందా? గోదావరిలో మునిగితే రోగాలు గ్యారంటీనా? అంటే అవుననే అంటున్నారు. గోదావరికి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోకి కెమికల్ నీళ్లు వచ్చి చేరుతున్నాయ్. పంటలు సాగు చేయటానికి ఆ నీటినే వాడుతున్నారు. అలా పండిన పంటలను తిని జనం రోగాల పాలవుతున్నారు. కలుషిత నీటిని తాగి ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం.

తెలంగాణలో గోదావరి ప్రవాహం అంతా కొండాకోనల మధ్య నుంచే వస్తుంది. భద్రాచలం నాలుగు రాష్ట్రాలకు కూడలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి డ్రైనేజీ నీళ్లన్ని గోదావరిలోనే కలుస్తున్నాయి. గోదావరిలోకి మురుగు నీటిని శుద్ది చేయకుండానే పంపిస్తున్నారు. ఈ నీటినే పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగిన జనం అనారోగ్యం పాలవుతున్నారు.

Also Read

  • BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
  • GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. "ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0" ప్రారంభం.!

భద్రాచలంలో ఆరు స్లూయిజ్‌లు ఉన్నాయి. ఆ స్లూయిజ్‌ల నుంచి భద్రాచలానికి చెందిన మురుగు నీరంతా గోదావరిలోనే కలుస్తుంది. భద్రాచలంలో డంపింగ్ యార్డు లేదు. పట్టణం చుట్టు ఒక్కవైపు గోదావరి ఉండగా..మరో వైపున ఆంధ్రా ప్రాంతం ఉంది. దీంతో పట్టణంలో చెత్త వేయడానికి కూడా స్థలం లేదు. గోదావరి కరకట్ట వెంట గోదావరిలోనే మొత్తం చెత్త అంతా వేస్తున్నారు. చెత్తతో ఇప్పుడు కరకట్ట వెడల్పుగా తయారైంది. పట్టణంలోని చెత్త, వైద్యశాలల నుంచి వచ్చే వేస్టేజీ గోదావరిలోనే వేస్తున్నారు. అదే గోదావరిలో కలుస్తుంది. గోదావరి బాగా వచ్చినప్పుడు కొట్టుకునిపోతుంది. ఇప్పుడు గోదావరి తీరం డంపింగ్ యార్డుగా తయారైంది.

గోదావరి నీటిని ఆధారంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్మిస్తున్నారు. గోదావరి పక్కనే ఐటిసి ఆధ్వర్యంలో పేపర్ బోర్డు నిర్మాణం జరిగింది. ఇది అంచెలంచెలుగా విస్తరించింది. అతి పెద్ద బహుళ జాతి సంస్థ కూడ. వారు తమ కెమికల్ నీటితో గోదావరిని కాలుష్య కాసారంగా తయారు చేస్తున్నారు. పేపర్ బోర్డులో నుంచి బయటకు వెళ్లే నీరు అంతా ఒక్క వరద కాలువ మాదిరిగా వెళుతుంది. ఈ కాలువ వెళ్లే దారిలో మనం ముక్కు మూసుకున్న కూడ నిలబడలేనంత దుర్వాస వస్తుంది.

గోదావరిలోకి రెండు చోట్ల ఈ కాలుష్య కారకమైన నీటిని ఐటిసి విడుదల చేస్తుంది. ఇంత దారుణంగా పట్ట పగలే నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నప్పటికి ఎవ్వరు ఏమీ అనరు. ఇక్కడ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఎటువంటి ఆందోళనలు చేయరు. అధికారులు అంతా ఆ కంపెనీ చేతిలో కీలుబొమ్మలుగా ఉంటారు. ఇక్కడి పోలీసు యంత్రాంగం ఆ కంపెనీ చేతిలో వ్యక్తులుగా ఉంటారు. ఐటిసి మీద ఎవ్వరు ఏమి మాట్లాడొద్దు. ఇంత కాలుష్య కారకాలను విడుదల చేస్తున్నప్పటికి ఇక్కడ నోరు విప్పడం మహా నేరంగా ఉంటుంది.

కొత్తగా ఇటీవల కాలంలో బిటిపిఎస్ నిర్మాణం చేపట్టారు. తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకు మణుగూరు వద్ద భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. నాలుగో యూనిట్‌ కూడా పూర్తి చేసుకుని విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. రాష్ర్టంలో విద్యుత్ కొరతను నివారించడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మాణం చేశారు. గోదావరి నుంచి విద్యుత్ ప్లాంట్ నీటిని తీసుకుంటుంది. ఆ తరువాత అదే నీటిని వదలడానికి యాష్ ప్లాంట్ నిర్మాణం చేశారు. ఐతే ఈనీళ్లు అన్ని ఇప్పుడు గోదావరిలోనే కలుస్తున్నాయి. ఇప్పుడు మణుగూరు ప్రాంతంలోని గోదావరి నీళ్లు అన్ని విద్యుత్ ప్లాంట్ నుంచి వచ్చిన కలుషిత నీటితో నిండిపోయాయి. గోదావరి మీద తెప్పలాగా కనిపిస్తుంది.

https://ntvtelugu.com/25-k-crores-for-dalitha-bandhu-programme/

ఇదే నీటిని ఇక్కడి ప్రజలు తాగుతున్నారు. పంట పొలాలకు సాగు నీటిగా ఉపయోగ పడుతుంది. మరోవైపు ఈప్రాంతంలో చేపల వేట సాగుతుంది. ఈ పొల్యూషన్ నీటి వల్ల గోదావరిలో చేపలు కూడా బతకడం లేదు. చేపలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. గతంలో బిటిపిఎస్ నిర్మాణ సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. లేటెస్టు టెక్నాలజీతో నిర్మాణం సాగుతుందని అందువల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదని చెప్పుకొచ్చారు. కాని మూడు యూనిట్ల నిర్మాణం వరకు గోదావరిలో పొల్యూషన్ రాలేదు. ఇప్పుడు నాలుగో యూనిట్ నిర్మాణం తరువాత పొల్యూషన్ వచ్చి పడుతుంది. దీంతో ఇక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తం మీద అటు గోదావరి కాలుష్య కాసారంగా తయారైంది. పొల్యూషన్ వల్ల నీళ్లన్ని విషతుల్యంగా మారుతున్నాయి. ఈ నీటిని జనం తాగుతున్నారు. అవే నీటిని పంట పొలాలకు వాడుతున్నారు. దీంతో ఇప్పుడు గోదావరి గరళ గోదావరిగా తయారవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhadrachalam
  • BTPS
  • DISEASES
  • DUMPING YARD
  • FEVERS

తాజావార్తలు

  • FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

  • Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions