Ganesh Navaratri : హాలో కమిటీ మెంబర్స్.. గణేష్ మండపం ఏర్పాటుకు నిబంధనలు ఇవే..!
- వినాయక మండపాలకు పోలీసుల కఠిన నిబంధనలు
- ఆన్లైన్ పర్మిషన్ తప్పనిసరి.. భద్రతా చర్యలు స్పష్టత
- డీజే, హై సౌండ్పై కఠిన ఆంక్షలు.. ఫైర్ సేఫ్టీ తప్పనిసరి
- నిమజ్జనం, విగ్రహాల తరలింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Navaratri : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు జోరుగా మొదలయ్యాయి. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని సూచించారు.
మండపాల ఏర్పాట్లలో తప్పనిసరి నిబంధనలు
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
మండపాల కోసం ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలి: https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
విద్యుత్ కనెక్షన్లకు అధికారుల అనుమతి తప్పనిసరి.
మండపాల నిర్మాణ పనులు నిపుణులకే అప్పగించాలి.
రోడ్లు పూర్తిగా బ్లాక్ చేయరాదు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
డీజేలకు నిషేధం, రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడరాదు.
మైక్ సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనలలోపే ఉండాలి.
సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి.
వర్షాలను దృష్టిలో ఉంచుకొని మండపాలు నిర్మించాలి.
భక్తుల తాకిడికి తగ్గట్టుగా క్యూలైన్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలి.
ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహన పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి.
పాయింట్ బుక్ లో నిర్వాహక కమిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
విగ్రహ నిమజ్జనం ప్రభుత్వం సూచించిన అధికారిక స్థలాల్లోనే జరగాలి.
నవరాత్రి మండపాలపై ప్రత్యేక సూచనలు
అగ్నిప్రమాదాలకు దారి తీసే వస్తువులను మండపాల వద్ద ఉంచరాదు.
విద్యుత్ వైర్లను పిల్లలకు అందకుండా సేఫ్గా అమర్చాలి.
వాలంటీర్లకు ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలి.
రాత్రిపూట కూడా వాలంటీర్లు విధుల్లో ఉండాలి.
తనిఖీ చేసిన తర్వాతే భక్తులను మండపాల్లోకి అనుమతించాలి.
ఉత్సవ నిర్వాహకులకు సూచనలు
మండపాల్లో టపాకాయలు, మందుగుండు సామగ్రి ఉంచరాదు.
ఎమర్జెన్సీ లైట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
జనరేటర్ వాడితే, ఇంధనాన్ని మండపానికి దూరంగా నిల్వ చేయాలి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలి.
ఆస్పత్రులు, విద్యాసంస్థలకు దగ్గరలో ఉన్న మండపాలు సౌండ్ సిస్టమ్ నిబంధనలు పాటించాలి.
నిమజ్జనం కోసం పోలీసులు సూచించిన మార్గాలనే వినియోగించాలి.
విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో విగ్రహాలు తరలించరాదు.
రద్దీ తక్కువగా ఉన్న సమయంలోనే తరలించాలి.
భారీ విగ్రహాలను చిన్న వాహనాల్లో తరలించరాదు.
నిపుణులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలి.
విద్యుత్ వైర్ల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
భారీ విగ్రహాల తరలింపులో క్రేన్లను వినియోగించాలి.
పిల్లలను విగ్రహాల తరలింపుకు తీసుకెళ్లరాదు.
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!