Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- రక్షణ శాఖ నుంచి అనుమతులు
- మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్
- రాజ్నాథ్కు సీఎం కృతజ్ఞతలు
- బాపు ఘాట్లో పనులకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Sarovar Project : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుండి కీలక అనుమతులు లభించాయి. హైదరాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాపు ఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలకమైన క్లియరెన్స్ లభించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సహకరించి, అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ , ఇండియన్ ఆర్మీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మూసీ పునరుజ్జీవనంలో కీలక మైలురాయి
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవనం (మూసీ ప్రక్షాళన), రివర్ఫ్రంట్ అభివృద్ధి విజన్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు అనుమతులు రావడం ఒక కీలక మైలురాయి అని అభివర్ణించారు. బాపు ఘాట్ పరిసర ప్రాంతాలలో ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కావడం వల్ల మూసీ పరివాహక ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చడమే లక్ష్యం
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కేవలం ఒక నదిలా కాకుండా.. అద్భుతమైన పర్యావరణ, సాంస్కృతిక , గొప్ప ప్రజా ఆస్తిగా (పబ్లిక్ అసెట్) మార్చడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి ఒక సరికొత్త పర్యాటక హంగులు తోడవుతాయని, పర్యావరణ రక్షణకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్తో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!