దేశంలోనే నంబర్వన్ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులు కీలకంగా మారాయి. మంచి చికిత్స పొందిన వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. భారత్లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మాత్రం ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది.
Read Also: స్వచ్ఛతలో అన్ని నగరాల కన్నా హైదరాబాద్ ముందుంది: కేటీఆర్
Also Read
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటివరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 84,127 మంది రోగులకు చికిత్స అందించినట్లు వైద్యులు వెల్లడించారు. దేశంలోని మరే ఇతర ఆస్పత్రిలో ఇంత మంది రోగులు చికిత్స పొందలేదు. కరోనా చికిత్స పొందిన వారిలో 3,762 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఉన్నారు. అంతేకాకుండా హైరిస్క్ గ్రూప్కు చెందిన 8,178 మంది డయాలసిస్ రోగులు కూడా ట్రీట్మెంట్ పొందారు. మెరుగైన వైద్యం అందించడం వల్లే గాంధీ ఆస్పత్రిలో కరోనా రికవరీ రేటు 98 శాతం సాధించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 44 మంది కరోనా పేషెంట్లు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
మరోవైపు కరోనాతో పాటు ప్రజలకు దడ పుట్టించిన బ్లాక్ ఫంగస్ వ్యాధికి కూడా గాంధీ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందజేశారు. ఇప్పటివరకు 1,786 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు గాంధీ ఆస్పత్రికి రాగా వారిలో 1,163 మందికి సర్జరీలు చేసి వారి ప్రాణాలను కాపాడినట్లు వైద్యులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లలో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే ఎక్కువగా వచ్చినట్లు వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..