Food Poisoning: కడుపు పట్టుకొని ఏడుస్తున్న విద్యార్థులు.. 35 విద్యార్థులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poisoning: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట పది మంది అస్వస్థత కాగా తరువాత ఒక్కొక్కరుగా విద్యార్థులు అస్వత్తతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 35 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఉదయం టిఫిన్ లో ఏమైనా పురుగులు పడ్డాయా లేదా రాత్రి తినే అన్నంలో ఏమైనా ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా వివరాలు స్పష్టంగా తెలియాల్సి వుంది. విద్యార్థులకు తీవ్రంగా కడుపునొప్పి వస్తుండటంతో కడుపును గట్టిగా పట్టుకుని ఆసుపత్రిలో కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా మిన్నంటింది.
గతంలో సెప్టెంబర్ 20న కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిన్న రాత్రి భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ బాగుండట్లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. వాంతులతో విద్యార్థులు కడుపునొప్పి ఎక్కువగా వస్తుందని కన్నీరు పెట్టుకున్నారు.
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
అదేనెల 6న తేదీన వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలోఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 40 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే వారిలో 12 గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా వుండంటతో.. మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం కు తరలించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!