Vemulawada: రాజన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం.. కొబ్బరి చిప్పలకు మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. వేములవాడ పట్టణంలోని జాతర మైదాన ప్రాంతంలోని ఆలయ వసతి గృహాల్లో అగ్నిప్రమాదం జరిగింది. గదుల్లో ఎండబెట్టిన కొబ్బరి చిప్పలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల కారణంగా స్థానికంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read also: TET Hall Tickets: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజే హాల్టికెట్లు విడుదల
Also Read
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేలంపాట ద్వారా టెండర్ దక్కించుకున్న కాంటాక్టర్కు చెందిన కొబ్బరి ముక్కలను నిత్యం ఎండబెట్టి విక్రయిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఆ కొబ్బరి ముక్కల్లోనుంచి పొగలు రావడం మొదలయ్యాయి. జాతరకు వచ్చిన ప్రజలకు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందో అర్థంకాలేదు. ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అయితే అక్కడే వున్న కొందరు సిబ్బంది పొగ రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జనం పరుగులు తీసారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వేములవాడలో జాతర జరుగుతుండగా వేలాది ప్రజలు హాజరయ్యారు. దీంతో ఈ ప్రమాదం సంబవించి నందుకు భక్తులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎటువంటి హానీ జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొబ్బరికాయలకు మంట ఎలా వ్యాపించింది అనేది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. జాతరకు వచ్చిన ప్రజలకు భాయాందోళన గురికావద్దని సూచించారు.
Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 296 మంది మృతి
తాజావార్తలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!