Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 296 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: ఆఫ్రికా దేశమైన మొరాకోలో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు మీద 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 300 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాలలో ప్రజలు కూరుకుపోయే అవకాశం ఉంది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం.. మొరాకోలోని మరాకేష్ నగరానికి 71 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. భూకంప కేంద్రం భూమికింద 18.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చెబుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. మరకేష్ నగరంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. విపత్తు అనంతరం స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. విధ్వంసానికి సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో చూడవచ్చు. రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయింది.
Read Also:RBI Data: పెరిగిన విదేశీ మారక నిల్వలు.. ఫారెక్స్ నిల్వలు 599 బిలియన్ డాలర్లు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
భూకంపం సంభవించిన వెంటనే స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోకి వచ్చారు. స్థానిక వ్యక్తి మాట్లాడుతూ, భూకంపం సంభవించిన కొద్దిసేపటికే వీధుల్లో చాలా అంబులెన్స్లు కనిపించాయని, పడిపోయిన భవనాలలో ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకునే అవకాశం ఉందని చెప్పారు. కాగా, మొరాకో భూకంపంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మొరాకోకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని చెప్పారు. గత 120 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఇంతటి తీవ్రతతో భూకంపాలు సంభవించలేదు. ఇంతకు ముందు దేశంలో ఎలాంటి భూకంపాలు సంభవించినా తూర్పు ప్రాంతాల్లోనే సంభవించాయి. భూకంపం వచ్చిన తర్వాత కూడా జనాల్లో భయాందోళనలు నెలకొని తిరిగి ఇళ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
Read Also:ATM Franchise: అదిరిపోయే ఐడియా.. ఏటీఎం ఫ్రాంఛేజీతో నెలకు రూ.70,000 సంపాదించండి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!