Fair Accident: రంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fair Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలోని కట్టెల గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో ఎగిసి పడుతున్న మంటలకు స్థానికులు బయటకు పరుగులు పెట్టారు. అయితే మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎం.ఎం.పహాడీ వద్ద ఓ కట్టెల గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసి పడుతున్న మంటలు.. దట్టంగా నల్లటి పొగ వ్యాపించాయి. సోఫా తయారీ చేసే షాప్ కు మంటలు అంటుకున్నాయి. రెండు గోదాంలు పూర్తిగా కాళీ బూడిద అయ్యాయి. పరిశ్రమలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పరిశ్రమలో ఉన్న మూడు టూవీలర్స్ దగ్ధమయ్యాయి. మంటలను చూసిన స్థానికులు బయటకు పరుగులు తీసారు. పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో గ్యాస్ సిలిండర్లు పట్టుకొని కుటుంబాలు బయటకు వచ్చింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో.. ఊపిరి ఆడక ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Chennai Encounter: చెన్నైలో ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీలను కాల్చిచంపిన పోలీసులు!
Also Read
- Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
స్థానికులు కూడా వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేశారు. గత అయిదు గంటలుగా మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కట్టెల గోదాం కావడంతో మంటలు వేగంగా ఎగిసిపడటంతో.. సరవేగంగా మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చలికాలం కావడంతో మంచు కురుస్తోంది. పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి ద్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటునుంచి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. అయితే షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
PM Modi : సౌదీ యువరాజుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.. యుద్ధం పై తీవ్ర ఆందోళన
తాజావార్తలు
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!