Fair Accident: రంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fair Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలోని కట్టెల గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో ఎగిసి పడుతున్న మంటలకు స్థానికులు బయటకు పరుగులు పెట్టారు. అయితే మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎం.ఎం.పహాడీ వద్ద ఓ కట్టెల గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసి పడుతున్న మంటలు.. దట్టంగా నల్లటి పొగ వ్యాపించాయి. సోఫా తయారీ చేసే షాప్ కు మంటలు అంటుకున్నాయి. రెండు గోదాంలు పూర్తిగా కాళీ బూడిద అయ్యాయి. పరిశ్రమలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పరిశ్రమలో ఉన్న మూడు టూవీలర్స్ దగ్ధమయ్యాయి. మంటలను చూసిన స్థానికులు బయటకు పరుగులు తీసారు. పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో గ్యాస్ సిలిండర్లు పట్టుకొని కుటుంబాలు బయటకు వచ్చింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో.. ఊపిరి ఆడక ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Chennai Encounter: చెన్నైలో ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీలను కాల్చిచంపిన పోలీసులు!
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
స్థానికులు కూడా వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేశారు. గత అయిదు గంటలుగా మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కట్టెల గోదాం కావడంతో మంటలు వేగంగా ఎగిసిపడటంతో.. సరవేగంగా మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చలికాలం కావడంతో మంచు కురుస్తోంది. పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి ద్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటునుంచి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. అయితే షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
PM Modi : సౌదీ యువరాజుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.. యుద్ధం పై తీవ్ర ఆందోళన
తాజావార్తలు
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?