PM Modi : సౌదీ యువరాజుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.. యుద్ధం పై తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi : అరేబియా సముద్రంలో ఉద్రిక్తత, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. అభివృద్ధితో పాటు, ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తుపై ప్రధాని మోదీ, మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య చర్చలు జరిగాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య పశ్చిమాసియాలో పరిస్థితిపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఉగ్రవాదం, హింస, పౌరుల మరణాలపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత కోసం కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ, మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అంగీకరించారు.
Read Also:Ayesha Meera Case: ఆయేషా మీరా కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసులు
Also Read
యువరాజుతో మాట్లాడిన అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా.. మేము పశ్చిమాసియాలోని పరిస్థితులపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాము. ఉగ్రవాదం, హింస, పౌర ప్రాణనష్టం గురించి ఆందోళన వ్యక్తం చేసాము. దీంతో పాటు ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత కోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. వరల్డ్ ఎక్స్పో 2030, ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2034కి హోస్ట్గా ఎంపికైనందుకు సౌదీ అరేబియాను ప్రధాని మోడీ అభినందించారు. గాజాలో రెండున్నర నెలలకు పైగా నెత్తుటి ఘర్షణ జరుగుతోంది. ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా మరణించారు. అయినప్పటికీ, గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ను నిర్మూలించే వరకు గాజాలో కాల్పుల విరమణ ఉండదని ఇజ్రాయెల్ పేర్కొంది.
Read Also:Salman Khan: సల్మాన్ ఖాన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఫ్యాన్స్ ఫిదా..
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?