Karimnagar Tragedy: కరీంనగర్ లో విషాదం.. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Tragedy: కరీంనగర్ లో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామంలో చాడ రంగారెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. చాడ రంగారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చాడ రంగారెడ్డి గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి 8 వ తరగతి,చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి 4వ తరగతి చదువుతున్నారు. అయితే ఎండులు మండుతుండటంతో కుమారులిద్దరిని తీసుకుని లోయర్ మానేరు జలశయానికి తండ్రి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరు కొడుకులను తీసుకుని ఈత కోసం నీటిలో దిగాడు. అయితే కాసేపు బాగానే ఇద్దరి పిల్లలతో నీటిలో ఆడుతూ గడిపిన తండ్రికి ఇంతలోనే చిన్నకొడుకు చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు. అక్కడే వున్న తండ్రి రంగారెడ్డి చిన్న కొడుకును కాపాడేందుకు వెళ్లాడు. అయితే కొడుకును కాపాడే ప్రయత్నంలో తండ్రి, కొడుకులు ఇద్దరు నీటిలో మునిగిపోయారు.
Read also: Gangs of Godavari: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్కు ముహూర్తం ఖరారు!
Also Read
అక్కడే వున్న పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి భయంతో ఈత కొడుతూ గడ్డవద్దకు చేరుకున్నాడు. నాన్న, తమ్ముడు అంటూ గట్టిగా కేకలు వేసినా అక్కడ పరిసర ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో కాపాడేందుకు ఎవరు రాలేదు. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ల ఎదుట తండ్రి, తమ్ముడు ప్రాణాలు కోల్పోతున్న కాపాడేలేక నిస్సాహాయ స్థితిలో పెద్ద కుమారుడు కౌసిక్ ఉండిపోయాడు. ఇక చేసేది ఏమీలేక కుంటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన లోయర్ మానేరు వద్దకు చేరుకున్నారు. జలాశయంలో ఇద్దరు తండ్రి, కొడుకు విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Metro: రేపు ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో, బస్సు సేవలు పొడిగింపు..
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!