Warangal: ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి ధరలు తగ్గించారని రైతన్న ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ జిల్లా ఏనుగుల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. వ్యాపారులు మిర్చి ధరలను అకస్మాత్తుగా తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకు రూ.25 వేలు పలికే వండర్ హాట్ రకం మిర్చిని ఒకేసారి రూ.15000 పలుకడంపై మండిపడ్డారు. ఇది సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం 20 వేలు పలికినా దానికి తగ్గట్టు ఏదైనా సర్దుకోవచ్చు కానీ.. లేదా 25 వేల కంటే ఎక్కువైనా పలకాలిగాని ఇంత తక్కువగా పలకడం ఏంటని వ్యాపారులపై విరుచుకుపడ్డారు. 15 వేలకు విక్రయించే 1048, 5531 రకం మిర్చి రూ.8 వేలు, తేజ రకం రూ.20 వేలు, రూ.12 వేలకు విక్రయిస్తున్నారని అన్నదాతలు ధర్నాకు దిగారు.
Read also: Ayodhya Flight Fare : ఆకాశాన్ని అంటిన విమాన ఛార్జీలు.. అయోధ్యకు వెళ్లేకంటే సింగపూర్ వెళ్లడం నయం
Also Read
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
- Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
మిర్చి ధరను వ్యాపారులు కావాలనే తగ్గించి కొనుగోలు చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే అప్పులు తెచ్చి పంటను పండిచామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం రోడ్డున పడుతుందని వాపోయారు. ధరలు తగ్గిస్తే ఊరుకునేది లేదని మార్కెట్ కార్యాలయాన్ని చుట్టు ముట్టారు. రైతుల ఆందోళనతో ఎనుమాము మార్కెట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో మార్కెట్ కార్యాలయల అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు రైతులు చేస్తున్న పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మిర్చి ధర పెంచే వరకు తమ ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల ధర్నా కొనసాగుతోంది.
Kadubandi Srinivasa Rao: బొత్సతో ఎస్.కోట ఎమ్మెల్యే భేటీ.. ఏదో ఆశించి నాపై ఫిర్యాదులు
తాజావార్తలు
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!