బీజేపీ గూటికి విఠల్.. టీఆర్ఎస్, కేసీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. వివిధ పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ గూటికి చేరారు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, పలువురు నాయకులు.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ , కేంద్ర మంత్రి నఖ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు చింతలగట్టు విఠల్.. పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. విఠల్ తో పాటు పార్టీలో చందు శ్రీనివాస్ రావు, టి.శ్రీనివాస్ రావు, వివేక్ తదితరులు బీజేపీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్, బీజేపీ పార్లిమెంట్ పార్టీ కార్యదర్శి కామర్సు బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Read Also: ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఉత్తర్వులు జారీ
Also Read
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు విఠల్.. ఈరోజు చరిత్రలో నేను మరచిపోలేని రోజు. ఈరోజు అంబేడ్కర్ వర్ధంతి.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవడం చాలా సంతోషగా ఉందన్నారు.. “గర్ వాపస్” వచ్చినందుకు సంతోషంగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్నది.. ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. తెలంగాణా తెచ్చుకుంది నిధులు, ఉద్యోగాల కోసం… ఉద్యమ సమయములో 1500 మంది విద్యార్ధులు బలిదానాలు చేశారని.. కానీ, తెలంగాణ వచ్చాకా కూడా ఉద్యోగాల కోసం పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. 50 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపిన విఠల్.. ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ఇప్పటి వరకు గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వలేదు… చాలా మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. యూనివర్సిటీల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు… రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. ఇక, బీజేపీతోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్లు వెళ్లి టీఆర్ఎస్ లో చేరుతున్నారు.. మంత్రి పదవులు తీసుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు విఠల్. మరోవైపు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి మాట్లాడుతూ.. విఠల్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. ఒకవైపు వారసత్వ రాజకీయాల పార్టీ, మరోవైపు ప్రజాస్వామ్య పార్టీ.. రాచరిక పార్టీ నుంచి ప్రజాస్వామ్య పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!