Etela Rajender: ప్రజలను మోసం చేయడంలో.. కేసీఆర్ నంబర్ వన్
Etela Rajender Fires On CM KCR In Sangareddy Pressmeet: తెలంగాణ సీఎం కేసీఆర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా నిప్పులు చెరిగారు. సంగారెడ్డిలోని జహీరాబాద్లో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రజాస్వామ్యన్నీ ఖూనీ చేసి రాచరిక వ్యవస్థ నడుపుతున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలను ఎన్నడు కలవని ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరేనని పేర్కొన్నారు. ఒక మంత్రికి కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోనివ్వరని అన్నారు. ఆబ్కారీ శాఖ ఆదాయాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమాంతంగా పెంచారన్నారు. అప్పుల్లో, తాగుబోతుల్లో.. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా.. వచ్చే ఎన్నికల్లో బిజెపినే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
YouTube channels Ban: భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు..యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్.
Also Read
అంతకుముందు కూడా.. కేసీఆర్ నేతలను కొనొచ్చేమోకానీ, ప్రజలను కొనలేరని ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్కు అహంకారం పెరిగిందని, ప్రజలంటే లెక్కలేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం మాదిరిగానే తూర్పు ఎమ్మెల్యే కూడా నేనే రాజు అనేలా వ్యవహరిస్తున్నారని.. పోలీసులతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, ఇప్పుడే బీఆర్ఎస్ పేరుతో దేశం మీద పడ్డారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోరాట పురిటిగడ్డ అయిన ఓరుగల్లు, కరీంనగర్ నుంచే అత్యధిక సీట్లలో గెలిచి.. కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కుటుంబ పాలన, నియంతృత్వ పాలనకు బీజేపీకి వ్యతిరేకమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
CM KCR: కుల-మతపిచ్చితో విద్వెషాలు రెచ్చగొడితే.. రాష్ట్రం తాలిబన్ల మాదిరి మారుతుంది
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో