Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
Read also: మహాయుతిలో సీట్ల పంపకానికి గ్రీన్ సిగ్నల్.. బీజేపీకి 28, శివసేన-ఎన్సీపీకి..?
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
అయితే తెలంగాణలో ఎండల తీవ్రత ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని ఈసీకి నివేదించింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం తెలంగాణలో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించాలని ఈసీ నిర్ణయించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Read also: Delhi High Court : అనుమతి లేకుండా ఫీజులు పెంచొద్దు.. ప్రభుత్వ సర్క్యులర్ను నిషేధించిన హైకోర్టు
దీని ప్రకారం సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న పోలింగ్ జరగనున్నందున.. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పోలింగ్ సమయాన్ని 6 గంటల వరకు పొడిగించాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్కు అనుమతించారు.
Read also: Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్
రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కు అనుమతిస్తే ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్కు పలు వినతులు అందాయి. అన్ని రాష్ట్రాలు గంటపాటు సమయాన్ని పొడిగించడంతో ఇక్కడ కూడా గంట పొడిగించేందుకు ఈసీ అనుమతించింది.
సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉన్న నియోజకవర్గాలు
అసెంబ్లీ నియోజకవర్గం : లోక్సభ నియోజకవర్గ పరిధి
1. సిర్పూర్ : ఆదిలాబాద్
2. ఆసిఫాబాద్ : ఆదిలాబాద్
3. చెన్నూరు : పెద్దపల్లి
4. బెల్లంపల్లి : పెద్దపల్లి
5. మంచిర్యాల : పెద్దపల్లి
6. మంథని : పెద్దపల్లి
7. భూపాలపల్లి : వరంగల్
8. ములుగు : మహబూబాబాద్
9. భద్రాచలం : మహబూబాబాద్
10. పినపాక : మహబూబాబాద్
11. ఇల్లందు : మహబూబాబాద్
12. కొత్తగూడెం : ఖమ్మం
13. అశ్వారావుపేట : ఖమ్మం
Nagari Politics: నగరిలో రోజా వ్యతిరేక వర్గానికి షాక్.. కీలకనేతపై సస్పెన్షన్ వేటు..
తాజావార్తలు
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!