TS Water Problems: ముదిరిన ఎండలు.. నీటి కోసం ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Water Problems: తెలంగాణలో మాడు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8గంటలకు బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక మధ్నాహ్నం అయితే ఎండలు అగ్ని గోళాన్ని తలపిస్తున్నాయి. దీంతో నీటి ఎద్దటి మొదలైంది. కాగా.. ఒక వైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడంతో.. ప్రధానంగా వెస్ట్జోన్లో నీటి ట్యాంకర్లలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక.. వచ్చేనెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యక్రమాలు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి దానకిషోర్తో కలిసి ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అయితే.. గతేడాదితో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందని దానకిషోర్ వివరించారు. ఇక వినియోగదారుల నుంచి డిమాండ్కు తగ్గట్టుగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
Read also: BRS KTR: బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
దీంతో.. రోజుకు 9 వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వాణిజ్య అవసరాలకు నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాణిజ్య వినియోగదారుల కోసం 300 అదనపు ట్రిప్పులు సరఫరా చేయబడతాయి. ఇందుకోసం కొత్తగా 250 ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఇతర మార్గాల ద్వారా 250 మంది డ్రైవర్లను నియమించనున్నారు.
ఏప్రిల్ మొదటి వారం నాటికి అదనపు ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని దానకిషోర్ తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం 7 డివిజన్లలో మొత్తం 20 కొత్త ఫిల్లింగ్ స్టేషన్లు, జీహెచ్ఎంసీలో ఆరు, జీహెచ్ఎంసీకి మించిన ఓఆర్ఆర్లో 14 ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆలస్యమైతే SMS ద్వారా సమాచారం అందించాలి.
Shivsena: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఏక్నాథ్ షిండే..
తాజావార్తలు
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!