TS Water Problems: ముదిరిన ఎండలు.. నీటి కోసం ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Water Problems: తెలంగాణలో మాడు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8గంటలకు బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక మధ్నాహ్నం అయితే ఎండలు అగ్ని గోళాన్ని తలపిస్తున్నాయి. దీంతో నీటి ఎద్దటి మొదలైంది. కాగా.. ఒక వైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడంతో.. ప్రధానంగా వెస్ట్జోన్లో నీటి ట్యాంకర్లలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక.. వచ్చేనెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యక్రమాలు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి దానకిషోర్తో కలిసి ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అయితే.. గతేడాదితో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందని దానకిషోర్ వివరించారు. ఇక వినియోగదారుల నుంచి డిమాండ్కు తగ్గట్టుగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
Read also: BRS KTR: బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
దీంతో.. రోజుకు 9 వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వాణిజ్య అవసరాలకు నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాణిజ్య వినియోగదారుల కోసం 300 అదనపు ట్రిప్పులు సరఫరా చేయబడతాయి. ఇందుకోసం కొత్తగా 250 ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఇతర మార్గాల ద్వారా 250 మంది డ్రైవర్లను నియమించనున్నారు.
ఏప్రిల్ మొదటి వారం నాటికి అదనపు ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని దానకిషోర్ తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం 7 డివిజన్లలో మొత్తం 20 కొత్త ఫిల్లింగ్ స్టేషన్లు, జీహెచ్ఎంసీలో ఆరు, జీహెచ్ఎంసీకి మించిన ఓఆర్ఆర్లో 14 ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆలస్యమైతే SMS ద్వారా సమాచారం అందించాలి.
Shivsena: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఏక్నాథ్ షిండే..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!