తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికపై బుధవారం కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన జూమ్ మీటింగ్ను నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఆశావహుల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ, ఇద్దరి పేర్లు ప్రముఖంగా…