DK Aruna : బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్ అప్రజాస్వామికం
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలవల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూ నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, ఆ హక్కును కాలరాసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. గ్రూప్-1 పేపర్ సైతం లీక్ అయ్యిందని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలొస్తున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి చిత్తుశుద్ధి నిరూపించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా తప్పులను ఎత్తిచూపుతున్న వాళ్లపై అమానుషంగా వ్యవహరిస్తూ నిరసనకారుల గొంతునొక్కుతుండటం సిగ్గు చేటని ఆమె ధ్వజమెత్తారు.
Also Read : NTR 30: తారక్ తిరిగొచ్చాడు… ఇక మొదలెడదామా?
ఈ విషయంలో కేసీఆర్ ఖాసీం రజ్వీని మించిపోయారని, అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగ పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిందని, కేసీఆర్ సర్కార్ చేతగానితనానికి నిదర్శనమిదని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ప్రభుత్వ తప్పిదాలవల్ల గతంలో ఇంటర్మీడియట్, ఎంసెట్ విద్యార్థులు సైతం ఇబ్బంది పడ్డారు. సీఎం కొడుకు నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగాలను భర్తీ చేయాలనే చిత్తశుద్ధి లేదు. అందులో భాగంగానే నోటిఫికేషన్ మొదలు పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల దాకా రకరకాల ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
Also Read : Supreme Court : ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వేసిన ప్రతిసారి కోర్టుకు వెళ్లే అవకాశమిచ్చేలా లోపాలను జోడిస్తున్నారు. ఒకవేళ ఎవరూ కోర్టుకు వెళ్లకపోతే.. ప్రశ్నాపత్రం లీకేజీలతో లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాడమాడుతున్నారు. ఒక పేపర్ ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణ చేస్తుంటే ఇంకో ప్రశ్నాపత్రం లీకేజీ అంశం వెలుగులోకి వస్తోంది. సమగ్ర విచారణ జరిపితే ఇంకెన్ని లీకులు బయటపడతాయో… అవినీతి కూపంలో నిండా మునిగిపోయిన కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని ఆమె అన్నారు.
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- DK Aruna
తాజావార్తలు
-
Rahul Gandhi: మహిళా బిల్లు కాదు, అందుకే అడ్డుకున్నాం..
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Amit Shah: లోక్సభ సాక్షిగా ఇండీ కూటమికి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.. నార్త్ – సౌత్ అంటూ విడగొడితే ఖబర్దార్!
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!