Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలను విడదీసి పటాన్ చెరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. మెదక్ జిల్లాలో మెదక్ రెవెన్యూ డివిజన్లోని రామాయంపేట, నిజాంపేట్, శంకరంపేట రూరల్ మండలాలను, తుప్రాన్ రెవెన్యూ డివిజన్లోని నార్సింగి మండలాలను విడదీసి రామాయంపేట కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్థానికులు ఆయా జిల్లాల కలెక్టర్లకు 15 రోజుల్లోగా దరఖాస్తులు అందజేయవచ్చు.
Read also: Nirmal: నిర్మల్ జిల్లాలో ఆదివాసీ అవస్థలు.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయాన్ని మెదక్ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. సీఎం వెంటనే స్పందించి ప్రకటన చేశారు. ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట (ఆర్), నార్సింగి మండలాలను రామాయంపేట రెవెన్యూ డివిజన్గా విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే మెదక్, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
NEET Fake OMR: నీట్లో నకిలీ ఓఎంఆర్ దాఖలు.. విద్యార్థినికి రూ. 20వేల జరిమానా
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!