Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలను విడదీసి పటాన్ చెరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. మెదక్ జిల్లాలో మెదక్ రెవెన్యూ డివిజన్లోని రామాయంపేట, నిజాంపేట్, శంకరంపేట రూరల్ మండలాలను, తుప్రాన్ రెవెన్యూ డివిజన్లోని నార్సింగి మండలాలను విడదీసి రామాయంపేట కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్థానికులు ఆయా జిల్లాల కలెక్టర్లకు 15 రోజుల్లోగా దరఖాస్తులు అందజేయవచ్చు.
Read also: Nirmal: నిర్మల్ జిల్లాలో ఆదివాసీ అవస్థలు.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం
Also Read
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయాన్ని మెదక్ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. సీఎం వెంటనే స్పందించి ప్రకటన చేశారు. ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట (ఆర్), నార్సింగి మండలాలను రామాయంపేట రెవెన్యూ డివిజన్గా విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే మెదక్, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
NEET Fake OMR: నీట్లో నకిలీ ఓఎంఆర్ దాఖలు.. విద్యార్థినికి రూ. 20వేల జరిమానా
తాజావార్తలు
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!