Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలను విడదీసి పటాన్ చెరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. మెదక్ జిల్లాలో మెదక్ రెవెన్యూ డివిజన్లోని రామాయంపేట, నిజాంపేట్, శంకరంపేట రూరల్ మండలాలను, తుప్రాన్ రెవెన్యూ డివిజన్లోని నార్సింగి మండలాలను విడదీసి రామాయంపేట కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్థానికులు ఆయా జిల్లాల కలెక్టర్లకు 15 రోజుల్లోగా దరఖాస్తులు అందజేయవచ్చు.
Read also: Nirmal: నిర్మల్ జిల్లాలో ఆదివాసీ అవస్థలు.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయాన్ని మెదక్ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. సీఎం వెంటనే స్పందించి ప్రకటన చేశారు. ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట (ఆర్), నార్సింగి మండలాలను రామాయంపేట రెవెన్యూ డివిజన్గా విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే మెదక్, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
NEET Fake OMR: నీట్లో నకిలీ ఓఎంఆర్ దాఖలు.. విద్యార్థినికి రూ. 20వేల జరిమానా
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!