Nirmal: నిర్మల్ జిల్లాలో ఆదివాసీ అవస్థలు.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmal: ప్రపంచం విప్లవోద్యమానికి శ్రీకారం చుడుతుంటే.. ఉమ్మడి అటవీ జిల్లా ఆదిలాబాద్ ఇప్పటికీ అవే కష్టాలతో తీరని కన్నీళ్లతో గడుపుతోంది. ప్రపంచం జాగృతమవుతున్న తరుణంలో పలుజిల్లాలో మాత్రం మనం ఇంకా వైద్యం కోసం ప్రవాహాలు దాటాల్సిన పరిస్థితి పోవడం లేదు. వర్షాలు వస్తే కొట్టుకుపోయే వంతెలనలు.. ఆస్పత్రికి వెళ్లేందుకు మార్గం లేక అంబులెన్స్కు వెళ్లే మార్గం లేకపోవడంతో గిరిజన వనవాసులు నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి దారుణ ఘటనే నిర్మల్ జిల్లా పెంబి అటవీ ప్రాంతంలోని కడెం నది సమీపంలోని మారుమూల గిరిజన గ్రామమైన తులసిపేటలో చోటుచేసుకుంది. తీవ్ర నొప్పులతో అల్లాడుతున్న ఆదివాసి గర్బిణి నట్టాదేవిలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నప్పటికీ తీవ్ర నొప్పులతో వాగు ఒడ్డున నాలుగు గంటలు గడిపింది.
నిర్మల్ జిల్లా పెంబి మండలం ఆదివాసీ గూడెంకు చెందిన తులసిపేటకు చెందిన గంగామణి అనే ఆదివాసీ మహిళకు గురువారం రాత్రి వెన్నునొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే గతేడాది కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలోని పస్పుల వంతెన కడెం వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామంతో పాటు మరో 10 మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు నదిలో అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెంబి మండలం తులసిపేట్ గ్రామానికి చెందిన గంగామణి అనే గర్భిణికి తీవ్ర నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు అంబులెన్స్కు ఫోన్ చేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో అక్కడికి చేరుకోలేకపోతున్నామని, పస్పుల వంతెన మీదుగా తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. గర్భిణి కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో అతికష్టమ్మీద కడెంవాగు దాటారు. అయితే ఒడ్డుకు చేరినా అంబులెన్స్ రాలేదని.. కారణం అడిగితే అంబులెన్స్లో డీజిల్ అయిపోయిందని, లేదంటే డ్రై కార్ట్లో తరలించే ఏర్పాట్లు చేశామని బదులిచ్చారు.
Also Read
అయితే గంగామణి మాత్రం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేసి పెంబి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. డీజిల్ లేకపోవడంతో అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఓ మహిళ నది ఒడ్డున నాలుగు గంటలపాటు రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది. ప్రపంచమంతా అభివృద్ధి పేరుతో గ్రామాన్ని మారుస్తుంటే గిరిజన గ్రామాలు మాత్రం రోడ్లపైనే ప్రసవిస్తూ గిరిజన జీవితాలకు భరోసా కల్పించలేకపోతున్నాయి.
Friday Remedies: శుక్రవారం నాడు ఈ 3 నివారణలు చేస్తే.. మీరు కోటీశ్వరుకు అవ్వడం పక్కా!
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!