Nirmal: నిర్మల్ జిల్లాలో ఆదివాసీ అవస్థలు.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmal: ప్రపంచం విప్లవోద్యమానికి శ్రీకారం చుడుతుంటే.. ఉమ్మడి అటవీ జిల్లా ఆదిలాబాద్ ఇప్పటికీ అవే కష్టాలతో తీరని కన్నీళ్లతో గడుపుతోంది. ప్రపంచం జాగృతమవుతున్న తరుణంలో పలుజిల్లాలో మాత్రం మనం ఇంకా వైద్యం కోసం ప్రవాహాలు దాటాల్సిన పరిస్థితి పోవడం లేదు. వర్షాలు వస్తే కొట్టుకుపోయే వంతెలనలు.. ఆస్పత్రికి వెళ్లేందుకు మార్గం లేక అంబులెన్స్కు వెళ్లే మార్గం లేకపోవడంతో గిరిజన వనవాసులు నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి దారుణ ఘటనే నిర్మల్ జిల్లా పెంబి అటవీ ప్రాంతంలోని కడెం నది సమీపంలోని మారుమూల గిరిజన గ్రామమైన తులసిపేటలో చోటుచేసుకుంది. తీవ్ర నొప్పులతో అల్లాడుతున్న ఆదివాసి గర్బిణి నట్టాదేవిలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నప్పటికీ తీవ్ర నొప్పులతో వాగు ఒడ్డున నాలుగు గంటలు గడిపింది.
నిర్మల్ జిల్లా పెంబి మండలం ఆదివాసీ గూడెంకు చెందిన తులసిపేటకు చెందిన గంగామణి అనే ఆదివాసీ మహిళకు గురువారం రాత్రి వెన్నునొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే గతేడాది కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలోని పస్పుల వంతెన కడెం వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామంతో పాటు మరో 10 మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు నదిలో అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెంబి మండలం తులసిపేట్ గ్రామానికి చెందిన గంగామణి అనే గర్భిణికి తీవ్ర నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు అంబులెన్స్కు ఫోన్ చేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో అక్కడికి చేరుకోలేకపోతున్నామని, పస్పుల వంతెన మీదుగా తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. గర్భిణి కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో అతికష్టమ్మీద కడెంవాగు దాటారు. అయితే ఒడ్డుకు చేరినా అంబులెన్స్ రాలేదని.. కారణం అడిగితే అంబులెన్స్లో డీజిల్ అయిపోయిందని, లేదంటే డ్రై కార్ట్లో తరలించే ఏర్పాట్లు చేశామని బదులిచ్చారు.
Also Read
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
అయితే గంగామణి మాత్రం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేసి పెంబి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. డీజిల్ లేకపోవడంతో అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఓ మహిళ నది ఒడ్డున నాలుగు గంటలపాటు రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది. ప్రపంచమంతా అభివృద్ధి పేరుతో గ్రామాన్ని మారుస్తుంటే గిరిజన గ్రామాలు మాత్రం రోడ్లపైనే ప్రసవిస్తూ గిరిజన జీవితాలకు భరోసా కల్పించలేకపోతున్నాయి.
Friday Remedies: శుక్రవారం నాడు ఈ 3 నివారణలు చేస్తే.. మీరు కోటీశ్వరుకు అవ్వడం పక్కా!
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..