హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ- కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీల నేతలు ఇష్టం వచ్చి నట్లు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ నాయకులపై అనవసర ఆరో పణలు చేస్తే ఊరుకోబోమని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరిం చారు. ఇకనైనా బీజేపీ నేతలు పిచ్చి కూతలు మానుకోవాలన్నారు.
మా 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తుమ్మితే ఆ తుంపర్లలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోతాయని, అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన విమర్శించారు. ఉద్యమ గొంతుకలను కేంద్రం అణగ దొక్కాలని చూస్తోందని, కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడబోమని వినయ్ భాస్కర్ అన్నారు. వరి ధాన్యం విషయంలో కేంద్రం పూటకో మాట మారుస్తు డ్రామాలు ఆడుతోందని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, లేదంటే ధాన్యం కొనుగోలుపై కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అంతే కాని రైతులపై కపట ప్రేమ నటిస్తూ రాష్ర్ట ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.