Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..
- నాగర్ కర్నూల్ జిల్లా ఖానాపూర్ లో విద్యుత్ అధికారుల తప్పిదం
- ఓ ఇంటికి ఏకంగా 21 కోట్ల 47 లక్షల బిల్లు వేసిన విద్యుత్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarkurnool: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనుంది. ఈ పథకం గత నాలుగు నెలలుగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పేదల ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ బిల్లు వందలు, లక్షలు కాదు కోట్లలో వచ్చింది. దీంతో ఇంటి యజమానికి గుండె ఆగివనంత పనైంది. ఈ వింత ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
Read also: Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ కు చెందిన వేమారెడ్డికి ప్రతినెలా వందల రూపాయల బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ ను స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాలని బిల్లు ఇచ్చారు. బిల్లు ఆలస్యంగా చూసిన వేమారెడ్డికి షాక్ తగిలింది. సాధారణంగా వందరూపాయల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో వస్తోందని ఆందోళన చెందడంతో విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఏఈ మహేశ్ ను వివరణ కోరగా జీరో బిల్లింగ్ సమయంలో ఇలా జరిగిందని తెలిపారు.
Read also: Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు
లైన్మెన్, జూనియర్ లైన్మెన్లు అవగాహన లేని బయటి వ్యక్తులతో కరెంటు బిల్లులు ఇస్తున్నట్లు సమాచారం. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేట్ వ్యక్తులే చేయడంతో వారికి అవగాహన లేకపోవడంతో కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతోంది. దీనిపై ఏఈ మహేశ్ను వివరణ కోరగా.. సాంకేతిక లోపంతో బిల్లులు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. కొనుగోలు ఫిర్యాదు మేరకు వెంటనే బిల్లులు సరిచేశామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకం కింద జీరో బిల్లును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే జీరో బిల్లు నడుస్తోంది. అయితే అందుకు భిన్నంగా లక్షలు, కోట్ల రూపాయల్లో బిల్లులు రావడంతో కొందరు అయోమయానికి గురవుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి.
Crime News: మదనపల్లెలో దారుణం.. తండ్రిని హత్య చేసిన కూతురు!
తాజావార్తలు
-
Vastu Tips: డబ్బు ఇంట్లో నిలవడం లేదా? ఉప్పు పాత్రలో ఈ ఒక్కటి ఉంచితే అదృష్టం మారుతుందా?
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!