Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..
- నాగర్ కర్నూల్ జిల్లా ఖానాపూర్ లో విద్యుత్ అధికారుల తప్పిదం
- ఓ ఇంటికి ఏకంగా 21 కోట్ల 47 లక్షల బిల్లు వేసిన విద్యుత్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarkurnool: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనుంది. ఈ పథకం గత నాలుగు నెలలుగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పేదల ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ బిల్లు వందలు, లక్షలు కాదు కోట్లలో వచ్చింది. దీంతో ఇంటి యజమానికి గుండె ఆగివనంత పనైంది. ఈ వింత ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
Read also: Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..
Also Read
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ కు చెందిన వేమారెడ్డికి ప్రతినెలా వందల రూపాయల బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ ను స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాలని బిల్లు ఇచ్చారు. బిల్లు ఆలస్యంగా చూసిన వేమారెడ్డికి షాక్ తగిలింది. సాధారణంగా వందరూపాయల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో వస్తోందని ఆందోళన చెందడంతో విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఏఈ మహేశ్ ను వివరణ కోరగా జీరో బిల్లింగ్ సమయంలో ఇలా జరిగిందని తెలిపారు.
Read also: Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు
లైన్మెన్, జూనియర్ లైన్మెన్లు అవగాహన లేని బయటి వ్యక్తులతో కరెంటు బిల్లులు ఇస్తున్నట్లు సమాచారం. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేట్ వ్యక్తులే చేయడంతో వారికి అవగాహన లేకపోవడంతో కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతోంది. దీనిపై ఏఈ మహేశ్ను వివరణ కోరగా.. సాంకేతిక లోపంతో బిల్లులు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. కొనుగోలు ఫిర్యాదు మేరకు వెంటనే బిల్లులు సరిచేశామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకం కింద జీరో బిల్లును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే జీరో బిల్లు నడుస్తోంది. అయితే అందుకు భిన్నంగా లక్షలు, కోట్ల రూపాయల్లో బిల్లులు రావడంతో కొందరు అయోమయానికి గురవుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి.
Crime News: మదనపల్లెలో దారుణం.. తండ్రిని హత్య చేసిన కూతురు!
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!