Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నలుగురు మంత్రుల పర్యటన
- ప్రాజెక్టు వెంట 5 కిలోమీటర్లు పర్యాటించనున్న మంత్రులు
- బిజి కొత్తురు - పూసుగూడెం పంపు హౌస్ ల పరిశీలన
- పంపు హౌస్ ల ఎలక్ట్రికేషన్ పై సమీక్ష సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Ministers: సీతారామ ప్రాజెక్ట్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాదించింది. ఈనేపథ్యంలో నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యాటించనున్నారు. ఖమ్మం నుండి చాపర్ లో బయలుదేరి సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీ నివాస రెడ్డి క్షేత్ర స్థాయి పరిశీలించనున్నారు. ప్రాజెక్టు వెంట 5 కిలోమీటర్లు పర్యాటించనున్న మంత్రులు. బిజి కొత్తురు, పూసుగూడెం పంపు హౌస్ ల పరిశీలించనున్నారు. పంపు హౌస్ ల ఎలక్ట్రికేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పై పవర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు అధికారులు వివరించనున్నారు. అనంతరం ఎన్కూర్ వద్ద వైరా లింజ్ కెనాల్ ను పరిశీలించి మంత్రులు తిరిగి హైదరాబాదు వెళ్లనున్నారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఓ చోట రిజర్వాయర్ నిర్మాణంకు సర్కారు ఆలోచనలో ఉంది.
Read also: Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు
Also Read
ఇక 10_13 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యం ఉండాలని భావిస్తోంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలో 4లక్షల ఎకరాలు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 1 .20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకం రూప కల్పనకు సిద్దమైంది. ప్రాజెక్టు పరిధిలో నాలుగు చోట్ల పంప్ హౌస్ లు నిర్మించారు. 16 ప్యాకేజీ లుగా విభజించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1_8 ప్యాకేజీ ల్లో 114 కిలోమీటర్ల పొడవు ప్రధాన కాల్వ నిర్మాణం, సత్తుపల్లి ట్రంక్ పనులు 9_12 ప్యాకేజీ లుగా విభజించారు. కాల్వ పొడవు 116 కిలోమీటర్లు ఉంటుంది. యాతాలకుంట టన్నెల్, గండుగులపల్లి వద్ద నాలుగో పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయి. పాలేరు ట్రంక్ పనులు 13_16 ప్యాకేజీ ల కింద75 కిలోమీటర్ల పొడవు కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీంతో పాలేరు నుండి మహబూబాబాద్ జిల్లా కు సాగు నీరు అందిచే క్రమమంలో అధికారులు సిద్దమవుతున్నారు.
Dear Nanna: డైరెక్ట్ ఓటీటీలోకి ‘డియర్ నాన్న’.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!