CP CV Anand : డ్రగ్స్ని సాఫ్ట్వేర్ వాళ్లే ఎక్కువగా వాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు డ్రగ్స్ కేసులలో 11 మంది అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన బషీర్బాగ్లో సీపీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4.50 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్, లాప్ టాప్ మొబైల్ ఫోన్లు సీజ్ చేసామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఏడుగురిని అరెస్ట్ చేయగా.. ఒకరు పరారీ లో ఉన్నారన్నారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరరా చేస్తున్న ముఠా అరెస్ట్ చేశామన్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువ మంది ఈ డ్రగ్స్ కేసులో ఇందులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 11 మంది సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో డ్రగ్స్ ఎక్కువ వాడుతున్నారన్నారు.
స్టూడెంట్స్ ను అరెస్ట్ చేయాలా.. లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలా అర్థం కాలేదన్నారు. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే వీళ్ళని అరెస్ట్ చేసామన్నారు. డార్క్ నెట్ వెబ్ సైట్ పై నిఘా పెట్టామని, నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ అనే స్టూడెంట్ కి డ్రగ్స్ అలవాటు ఉందని ఆయన తెలిపారు. డార్క్ నెట్ వెబ్ సైట్ ద్వారా ఈ విద్యార్ధి ఎల్ఎస్డీ బ్లాడ్స్ను రూ.1200 లకు 20 కొన్నాడన్నారు. ఇక్కడ వీటిని ఐదు రెట్లు ఎక్కువకి అమ్ముతున్నారని, 10 బ్లాడ్స్ ను ఒక పార్టీలో వినియోగించారన్నారు. 10 బ్లాడ్స్ ను వేరే వాళ్ళకీ అమ్మారని, గోవా నుంచి హైదరాబాద్ కి తీసుకోని వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నారని ఆయన తెలిపారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ఎండీఎంఏ అనే డ్రగ్ని ఒక నైజీరియన్ దగ్గిర కొంటున్నారని, ఓ నైజీరియన్ చాలా కాలం నుంచి ముంబాయి లో 2013 నుండి అనుమతి లేకుండా ఉంటున్నాడని ఆయన వెల్లడించారు. జ్వాల పాండే అనే వ్యక్తి హాష్ ఆయిల్ అనే డ్రగ్ ను సరఫరా చేస్తున్నారని, నిఖిల్ అనే వ్యక్తి ఈ హాష్ ఆయిల్ నీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నాడని పేర్కొన్నారు. జ్వాల పాండే అదిలాబాద్ జిల్లా కి చెందిన రైతులు నుంచి నేరుగా గంజాయి ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తున్నారని, సొన రాయి అనే రైతు మరొక రైతు నుంచీ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఒక కేజీ 15 వేలకి కొని 50 వేల రూపాయలకి ఐటి ఉద్యోగులకి అమ్ముతున్నారని తెలిపారు.
మంగళ్ హాట్ కి చెందిన ఓ వ్యక్తి జొమాటో డెలివరీ బాయ్ లానే ఇంటికీ వెళ్ళి గంజాయి డెలివరీ చేస్తాన్నాడని తెలిపారు. చాలా మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే ఈ కేసులో ప్రమేయం ఉందని, యూనివర్సిటీ లో విచ్చలవిడి గా డ్రగ్స్ వినియోగం పెరిగిందని ఇప్పటి నుంచి డ్రగ్స్ వినియోగం చేస్తున్న వారిని వదిలి పెట్టే అవకాశం లేదని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!