Kodandaram: ఆయనకు కాంగ్రెస్ తో దోస్తీ కుదిరేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా వుంటాయి. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వివిధ పార్టీలు కలిసి పోటీచేయాలని భావిస్తుంటాయి. తాజాగా ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితితో కలిసి నడవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎలాగైనా మనుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్ తన సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చే పార్టీల వైపు కన్నేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.తమతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి అనే విషయంపై ఆరా తీస్తున్నాయి. అందులో భాగంగా టీజెఎస్ వారికి కనిపించింది. ఆ పార్టీ అధిరుత కోదండరాం తో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి కోదండరాంతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకు కోదండరాంని కలిశాం అన్నారు మహేష్ గౌడ్. త్వరలో జరగబోయే మునుగోడు ఎన్నికలపై చర్చ చేశాం…ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్దతు ఇవ్వాలని కోరాం.. కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కోదండరాం చెప్పారు.
Also Read
- వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
టీఆర్ఎస్-బీజేపీ వ్యవహార శైలిపై చర్చ జరిగింది… రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాం.. సిద్ధాంత పరంగా మాతో కలిసి వచ్చే పార్టీ లను కలుపుకుని పోతాం అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, టిఆర్ఎస్ ను ఓడించాలంటే తమకు మద్దతు పలకాలని మహేష్ గౌడ్ కోదండరాంని కలిసి కోరారు.
Read Also: Bihar Politics: ఏం చేద్దాం.. బీహార్ బీజేపీతో నడ్డా, అమిత్ షా భేటీ
మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అన్న సంగతి తెలిసిందే. అయితే, మునుగోడులో మళ్ళీ గెలుపు అనుకున్నంత ఈజీ కాదని, కాస్త కష్టమయినా గెలిచే సత్తా వుందని కాంగ్రెస్ భావిస్తోంది. మునుగోడులో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా, ఇక్కడ విజయం సొంతం చేసుకోవచ్చనే లెక్కలు వేసుకుంటోంది టీపీసీసీ. అయితే తక్కువ కాలం మాత్రమే పదవీకాలం వున్న వేళ కాంగ్రెస్ కు అంత బలమయిన వ్యక్తి ఎవరు దొరుకుతారనేది మిస్టరీగా మారింది. బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం వుందని, అందులో భాగమే మునుగోడు ఎన్నికలు అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇదిలా వుంటే.. కాంగ్రెస్ మద్దతు కోరిందని తెలిపారు కోదండరాం. పార్టీ లో చర్చ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే నియోజక వర్గం లో మేము పని చేస్తున్నాం. పార్టీలో చర్చ చేసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం అని చెప్పారు కోదండరాం.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!