ఇది రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం : బోరెడ్డి అయోధ్య రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయని, పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయని ఆయన అన్నారు. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుందని, 51-100 యూనిట్లు వాడే వినియోగదారుల మీద 39.50 శాతం భారం పడనుందని ఆయన తెలిపారు. 800 యూనిట్లకు పైగా విద్యుత్ ను వాడే వినియోగదారుల మీద 8.9 శాతం మాత్రమే అదనంగా భారాన్ని మోపుతున్నారాని ఆయన అన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం అన్ని ఆయన మండిపడ్డారు.
72.50 రూపాయల చార్జీలు చెల్లిస్తున్న పేదలు ఏప్రిల్ నుంచి 112.50 చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు ఖాళీగా ఉంటే ఇప్పుడు నెలకు 55 రూపాయలను కనీస చార్జీ ఉంది. అది వచ్చే నెల నుంచి 150 రూపాయలు చెల్లించాలి. ఇది 173 శాతం అదనంగా పెంచారు. తక్కువ ధరతో రామగుండం ప్లాంటు నుంచి కొనడం ఆపేసి భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నుంచి ఎక్కువ ధరకు కొంటామని పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. విద్యుత్ 84,222 మిలియన్ యూనిట్లు అవసరం అని పంపిణీ సంస్థలు అంటున్నాయి. గత ఏడాది కన్నా ఇది16.69 శాతం ఎక్కువ. ఇంత విద్యుత్ వినియోగం ఉండదు. జెన్ కో సంస్థలు కేవలం 55 శాతమే సామర్ధ్యం ఉత్పత్తి చేస్తున్నది. ఉత్పత్తి సామర్ధ్యము పెంచితే కొనాల్సిన అవసరం తక్కువ. 698 విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. దీనికి 529 కోట్లు పరిహారం. భద్రతా చర్యలు లేక పోవడం వల్ల ఈ దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. 'నిరంజన్' కన్నుమూత!
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
- Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వ కృషి ఫలించింది.. సింగరేణికి ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్..
- CM Revanth Reddy : కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం
తాజావార్తలు
-
Sing Geetham OTT Release : ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘సింగ్ గీతం’
-
14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
-
Redmi Turbo 6 Max: రెడ్మీ టర్బో 6 మ్యాక్స్.. 10000mAh బ్యాటరీ, 7-ఇంచెస్ 2K డిస్ప్లేతో వచ్చేస్తోంది!
-
NTR Neel : ‘డ్రాగన్’ ఇంటర్వెల్ ఎపిసోడ్.. నెవర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్
-
Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!