CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
- కాళేశ్వరంపై జాయింట్ సెషన్కు ఆహ్వానం
- కేసీఆర్ కుటుంబంపై సీఎం విమర్శలు
- ప్రాజెక్టు మరమ్మతులపై కీలక వ్యాఖ్యలు
- ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి నెవ్వెర్ బిఫోర్ అనదగ్గ రీతిలో బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ కోరుకున్న రోజున అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పీకర్కు లేఖ రాసి ఆయనే స్వయంగా ఒక తేదీని ఖరారు చేయాలని, ఇరు సభల జాయింట్ సెషన్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దామని పిలుపునిచ్చారు. సభలో కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా, చర్చ సజావుగా సాగేలా చూసుకునే పూర్తి బాధ్యత తమదేనని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు రిపేర్ల బాధ్యతను ఎందుకు ఆయనకే అప్పగించాలో సభలో చెబితే, రాబోయే మూడేళ్ల పాటు కాళేశ్వరం మరమ్మతుల బాధ్యతలను కేసీఆర్కే అప్పగిస్తామని సీఎం స్పష్టం చేశారు.
కుటుంబం వేల కోట్లకు ఎలా ఎదిగింది? ఆ సీక్రెట్ చెప్పండి
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై గత ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. “సాధారణంగా బాంబులు పెడితే పైకి పేలాలి.. కానీ ప్రాజెక్టు కిందకు కుంగిపోతుందా?” అంటూ ఎద్దేవా చేశారు. ఇంత జరిగినా సిగ్గులేకుండా తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కేవలం ఒక్కొక్కరిని కాకుండా, రాష్ట్రానికి నష్టం చేసిన ఆ కుటుంబాన్ని మొత్తంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే.. మరోవైపు ఆ కుటుంబం మాత్రం వేల కోట్లకు ఎలా ఎదిగిందో, ఆ సీక్రెట్ ఏదో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి ప్రజలకు చెబితే బాగుంటుందని హితవు పలికారు. ఆయన ఇచ్చే ప్రసంగం, సలహాలు ప్రజలకు ఉపయోగపడితే కచ్చితంగా వాడుకుంటామన్నారు.
Also Read
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
- Jagadish Reddy: కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం..
- Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
ఒకటో తేదీనే జీతాలు.. పనులపై సెల్ఫీలా
గత ప్రభుత్వ హయాంలో నెలాఖరు వరకు జీతాల కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సి వచ్చేదని, కానీ తమ ప్రజా ప్రభుత్వంలో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని సీఎం గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాళ్లకు కూడా ఒకటో తేదీనే జీతం వేసి చూపించామన్నారు. తాము టిమ్స్ (TIMS) ఆసుపత్రుల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం అక్కడికి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని, క్వాలిటీ, ప్రజల సంక్షేమం విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!