Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. ‘నిరంజన్’ కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Fan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) ఇకలేరు. గత కొంతకాలంగా అరుదైన జన్యుసంబంధిత (మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిరంజన్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. నిరంజన్ మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
మూడేళ్ల వయసు నుంచే పోరాటం..
నిరంజన్ మూడేళ్ల ప్రాయం నుంచే ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ప్రభావం వల్ల 17 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఆయన కేవలం నాలుగేళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయారు. శారీరకంగా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అంటే నిరంజన్కు ప్రాణం. ఆయన సినిమాలకు డ్యాన్స్ చేస్తూ, పవన్ కళ్యాణ్ స్టైల్స్ అనుకరిస్తూ స్థానికంగా ‘ఛోటా గబ్బర్ సింగ్’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ఇటీవలే తీరిన కల.. ఇంటికొచ్చి పరామర్శించిన పవన్
తన ప్రాణ సమానుడైన హీరో పవన్ కళ్యాణ్ను కలవాలన్నదే నిరంజన్ చివరి కోరిక. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా జనసేనాని దృష్టికి వెళ్లడంతో, పవన్ కళ్యాణ్ గత జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వచ్చి.. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చుని, ఆత్మీయంగా ముద్దాడి, ధైర్యం చెప్పారు. నిరంజన్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి జీవనోపాధి కోసం ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని, భద్రకాళి అమ్మవారి వెండి విగ్రహాన్ని బహూకరిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
జనసేన శ్రేణుల సంతాపం
తమ అభిమాన హీరోను కలిసి, ఆ ఆనందంలో మునిగితేలిన కొన్ని రోజులకే నిరంజన్ అనంత లోకాలకు వెళ్లిపోవడం అటు కుటుంబ సభ్యులను, ఇటు పవన్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. నిరంజన్ మరణ వార్త తెలిసిన వెంటనే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, నిరంజన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి సంచారం తెలుసుకున్న సోనూసూద్ ఫోన్లో కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరడంతో పాటు, త్వరలోనే వరంగల్కి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తాను అంటూ ఫోన్లో సమాచారం ఇచ్చారు.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!