గత ప్రభుత్వంలో పద్మశ్రీ రామచంద్రయ్యను సన్మానించి అండగా ఉంటామని చెప్పారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ, పేదల ప్రభుత్వం వచ్చిన సందర్భంలో దురదృష్టవశాత్తూ అనారోగ్య రీత్యా పద్మశ్రీ అందరికీ దూరమయ్యారు.. గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైంది అని వ్యాఖ్యానించారు. పద్మశ్రీ పట్ల గత ప్రభుత్వం మాటలకి పరిమితమైందే తప్ప చేతులతో ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోవటం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు ప్రకటించిన గత ప్రభుత్వం ఆదుకోలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Ghaziabad: రోడ్డుపై నగ్నంగా తిరిగిన మహిళ.. పోలీసుల గాలింపు
ఇక, గత ప్రభుత్వం హామీలను పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు అమలు పరచి రామచంద్రయ్యకు ఇవ్వకపోవడం బాధాకరం అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి కొత్తగూడెంలో 462 గజాల స్థలాన్ని ఇచ్చే విధంగా జిల్లా అధికారులకు ఆదేశించాను.. పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్యకు ఆనాటి ప్రభుత్వం చేసిన వాగ్దానం ఈనాటి ప్రజా ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు డాక్యుమెంట్స్ సిద్ధం చేసి నెరవేర్చామని తెలిపారు. రామచంద్రయ్య విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు పరిమితమైన అంశాలన్నీ ఈ ప్రభుత్వంలో ఆదుకోవడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.