TPCC Mahesh Goud : జంతర్ మంతర్ చేరేందుకు కార్యకర్తలకు ప్రత్యేక రైలు
- ఢిల్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ధర్నా
- జంతర్ మంతర్ చేరేందుకు కార్యకర్తలకు ప్రత్యేక రైలు ఏర్పాటు
- ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పణ
- ఏఐసీసీ ఇంచార్జ్, టీపీసీసీ అధ్యక్షుడు కార్యకర్తలతో కలిసి ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ధర్నాలో పాల్గొనే కార్యకర్తలను రైల్వే స్టేషన్కు చేర్చే బాధ్యత ఆయా జిల్లా డీసీసీ అధ్యక్షులదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆగస్టు 5న పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగేలా వాయిదా తీర్మానం కోసం కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని గౌడ్ వెల్లడించారు.
Also Read
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?
ధర్నా అనంతరం ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి, రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ ఉద్యమంలో రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకునేందుకు టీపీసీసీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరనుందని, 7న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. కార్యకర్తలు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ఈ ఉద్యమానికి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా హాజరవుతున్నారు. వీరు కూడా చర్లపల్లి నుంచి నాగపూర్ వరకు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైల్లోనే ప్రయాణించనున్నారు.
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!