TPCC Mahesh Goud : జంతర్ మంతర్ చేరేందుకు కార్యకర్తలకు ప్రత్యేక రైలు
- ఢిల్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ధర్నా
- జంతర్ మంతర్ చేరేందుకు కార్యకర్తలకు ప్రత్యేక రైలు ఏర్పాటు
- ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పణ
- ఏఐసీసీ ఇంచార్జ్, టీపీసీసీ అధ్యక్షుడు కార్యకర్తలతో కలిసి ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ధర్నాలో పాల్గొనే కార్యకర్తలను రైల్వే స్టేషన్కు చేర్చే బాధ్యత ఆయా జిల్లా డీసీసీ అధ్యక్షులదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆగస్టు 5న పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగేలా వాయిదా తీర్మానం కోసం కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని గౌడ్ వెల్లడించారు.
Also Read
Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?
ధర్నా అనంతరం ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి, రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ ఉద్యమంలో రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకునేందుకు టీపీసీసీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరనుందని, 7న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. కార్యకర్తలు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ఈ ఉద్యమానికి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా హాజరవుతున్నారు. వీరు కూడా చర్లపల్లి నుంచి నాగపూర్ వరకు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైల్లోనే ప్రయాణించనున్నారు.
తాజావార్తలు
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!