CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- రూ. 1,011 కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లకు శ్రీకారం
- 60 రోజుల్లో 11 వేల టీచర్ పోస్టుల భర్తీ: సీఎం
- ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య
- నాణ్యతలేని ఎడ్యుకేషన్ కిట్లపై సీఎం సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గడ్డపై విద్యా విప్లవానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, విద్యార్థుల భవిష్యత్తును మార్చే దిశగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రూ. 1,011 కోట్లతో క్యూర్ (CORE) ప్రాంతంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యాశాఖ స్టాల్స్ ను సందర్శించిన సీఎం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. “తెలంగాణ సమాజం బలోపేతం కావాలంటే విద్య, వైద్యం అందరికీ సమానంగా అందాలి. అందుకే విద్యాశాఖను వేరే ఎవరికీ ఇవ్వకుండా నేనే నా దగ్గర పెట్టుకున్నాను. సమీక్షల సమయంలో నన్ను సీఎంగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి. తండాలు, గూడాలు, మారుమూల గ్రామాల్లోని పేద బిడ్డలకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. అవుటర్ రింగ్ లోపల ఉన్న విద్యా సంస్థల అభివృద్ధి కోసం రూ. 1,700 కోట్లతో ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ప్రభుత్వ విద్యపై తమకున్న చిత్తశుద్ధిని చాటుతూ, కేవలం 60 రోజుల్లోనే 11,000 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని సీఎం గుర్తు చేశారు. దాదాపు 22 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు, ఎంతో క్లిష్టమైన 36 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ విజయాలను నీతి ఆయోగ్ సైతం అభినందించిందని ఆయన గర్వంగా ప్రకటించారు. ప్రభుత్వ టీచర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు 25 మందిని ఇప్పటికే ఫిన్లాండ్ పంపించామని, రాబోయే రోజుల్లో మరో 500 మంది ప్రతిభావంతులైన టీచర్లను విదేశీ శిక్షణకు పంపిస్తామని హామీ ఇచ్చారు.
“రాష్ట్రంలో 12 వేల ప్రైవేట్ స్కూళ్లలో 38 లక్షల మంది ఉంటే, 27 వేల ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న గొప్పతనం ఏమిటి? ప్రభుత్వ స్కూళ్లలో లోపం ఏమిటి? అని ప్రశ్నించుకోవాలి. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను ప్రవేశపెడుతున్నాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్లో విద్యకు కేటాయించిన 8 శాతం నిధులను క్రమంగా 15 శాతానికి పెంచుతామన్నారు. 100 నియోజకవర్గాల్లో రూ. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని, ఇక్కడ చదువుకున్న పేద బిడ్డలు గర్వంగా తమ పాఠశాల పేరు చెప్పుకోవాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సంక్షేమం కోసం కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం, డైట్ ఛార్జీలను 40 శాతం పెంచినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాలు, రాగిజావతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తామని, కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నామని చెప్పారు. అలాగే రూ. 1,000 కోట్లతో ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని, ఈ వస్తువుల నాణ్యతను తానే స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. “విద్యార్థులకు నాణ్యత లేని వస్తువులను సరఫరా చేసే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాదు.. వారిని బొక్కలో తోయించే బాధ్యత నాది” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఉపాధ్యాయులపై నమ్మకం ఉంచుతూ, వారికి ఒకటో తారీఖునే జీతాలు అందజేస్తున్నామని సీఎం చెప్పారు. “టీచర్లకు ఇది కేవలం ఉద్యోగం కాదు.. అదొక బాధ్యత. 19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పనిచేయాలి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావని, అవి అభివృద్ధి వేదికలని చాటిచెప్పేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!