Home
Education Reforms
Education Reforms News
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
PM Modi: భారతదేశ పరీక్ష విధానంలో సంస్కరణకు ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఆదివారం ప్రకటించారు. ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నవారు ఇప్పుడు జైలులో ఉన్నారని ఆయన అన్నారు.… -
Sonam Wangchuk: ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’.. కేంద్రమంత్రి రాజీనామాపై సోనమ్ వాంగ్చుక్..
Sonam Wangchuk: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ తొలిసారిగా స్పందించారు. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’ అంటూ ఎక్స్లో పోస్టు చేశారు. జూన్ 28న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ, నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి కేసులు ఉండబోవనే హామీ, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు… -
Dharmendra Pradhan Resign: ధర్మేంద ప్రధాన్ రాజీనామా.. ఆప్, కాంగ్రెస్ స్పందన ఇదే..
Dharmendra Pradhan Resign: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనిని విద్యార్థి విజయంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి రాజకీయ, న్యాయపరమైన వివాదాల్లో్ చిక్కుకోవద్దని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే ప్రతిపక్ష పార్టీలు, నేతలు స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో స్పందిస్తూ.. “యువత విజయం. అహంకారియైన… -
NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
NTA: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థులు , వారి తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర కీలక చర్యలకు ఉపక్రమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఏలో 47 మంది అధికారుల్ని తొలగించారు. వారిలో కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల రోజుల్లో ఎన్టీఏ పూర్తిస్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచడం, పేపర్ లీక్కు… -
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజీ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTAలకు అత్యున్నత కోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక చిట్కాలతో సరిపెట్టకుండా, వ్యవస్థాగతంగా ఎలాంటి శాశ్వత సంస్కరణలు చేపడుతున్నారో సమగ్రంగా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. -
Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..
Public Examinations Act: నీట్ (NEET) పరీక్షల లీకేజీల వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీలు, కాపీయింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా యువతలో రేగుతున్న నిరసనల సెగను గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఈ వ్యవహారంపై ఆలస్యంగానైనా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి వేళ విడుదల చేసిన ఓ భావోద్వేగ వీడియో సందేశంలో ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు.… -
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ గత 26 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలతో ఎట్టకేలకు విరమించారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో జవాబుదారీతనం, నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చ జరుపుతామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన తన నిరసనను ముగించారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో జులై 24 అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర… -
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
Preity Zinta Support Student Protests: బాలీవుడ్ నటి ప్రీతి జింటా విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై స్పందించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆమె విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ, ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అదే సమయంలో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ఎలాంటి దుష్టశక్తులు లేదా అనుమానాస్పద వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.… -
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
తెలంగాణ గడ్డపై విద్యా విప్లవానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, విద్యార్థుల భవిష్యత్తును మార్చే దిశగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రూ. 1,011 కోట్లతో క్యూర్ (CORE) ప్రాంతంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యాశాఖ స్టాల్స్ ను సందర్శించిన సీఎం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై… -
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
మారుతున్న కాలానికి తగినట్లు మారితేనే మనుగడ సాధ్యమవుతుంది.. ఈక్రమంలోనే విద్యా రంగంలోనూ పలు సంస్కరణలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిల్లలంతా బడుల్లో ఉండడమే కాదు పెద్దలు సైతం అక్షరాలు నేర్చుకోవాలని… ఆధునిక కాలపు అవసరాలకు తగినట్లు తమను తాము మల్చుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యోచన. అందుకే వయోజన అక్షరాస్యత పెంపునపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపర్చుతోంది. అదే సమయంలో పాఠశాల విద్యా రంగంపైనా ప్రభుత్వం…
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!