CM Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి.. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పవర్ఫుల్ కామెంట్స్..!
- చిట్చాట్లో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
- తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీకాదు
- 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి
- నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను
- నన్ను అన్నవాళ్లనే.. నేను అంటున్నా
- పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటా-సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా చిట్చాట్లో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు” అంటూ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేసిన రేవంత్, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లకే తాను బదులిస్తున్నానని స్పష్టం చేశారు. “నా మతం, నా పేరు మార్చి మాట్లాడినప్పుడు నాకు దుఃఖం ఉండదా?” అని ప్రశ్నిస్తూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలపై ఘాటుగా స్పందించారు.
iPhone 18 Pro Leaks: ఐఫోన్ 17 కంటే 5 Major Upgrades.. 2nm చిప్సెట్ అరుపులే.!
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తాను ఏ రాష్ట్రంతోనూ పోల్చుకోనని, పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సహనంతో కేంద్రాన్ని అడిగి పరిష్కరించుకుంటున్నామని రేవంత్ తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కోసం సీబీఐ డైరెక్టర్తో పాటు కేంద్ర హోంశాఖకు ఇప్పటికే లేఖ రాశామని, అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని గుర్తు చేశారు. కాళేశ్వరంలో నీళ్లు నింపితే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పూర్తిస్థాయి స్టడీ చేయిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ కమిషన్ కేసును కూడా కేంద్రానికే అప్పగించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరిందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత కీలక మలుపులు చోటు చేసుకున్నాయని తెలిపారు. “కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? కేసీఆర్ను ఎందుకు లోపల వేయలేదు?” అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విచారించిన ఈడీ.. ఫార్ములా-ఈ రేసులో స్పష్టంగా మనీ లాండరింగ్ కనిపిస్తున్నా కేటీఆర్ను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. బీజేపీ నాయకుడి మరణంపై స్థానిక పోలీసులపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకు కూడా తాము సిద్ధమని, కేసీఆర్-కేటీఆర్లను రక్షించడానికే కిషన్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!