CM Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి.. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పవర్ఫుల్ కామెంట్స్..!
- చిట్చాట్లో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
- తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీకాదు
- 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి
- నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను
- నన్ను అన్నవాళ్లనే.. నేను అంటున్నా
- పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటా-సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా చిట్చాట్లో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు” అంటూ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేసిన రేవంత్, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లకే తాను బదులిస్తున్నానని స్పష్టం చేశారు. “నా మతం, నా పేరు మార్చి మాట్లాడినప్పుడు నాకు దుఃఖం ఉండదా?” అని ప్రశ్నిస్తూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలపై ఘాటుగా స్పందించారు.
iPhone 18 Pro Leaks: ఐఫోన్ 17 కంటే 5 Major Upgrades.. 2nm చిప్సెట్ అరుపులే.!
Also Read
- IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం.. హైదరాబాద్కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
- Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తాను ఏ రాష్ట్రంతోనూ పోల్చుకోనని, పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సహనంతో కేంద్రాన్ని అడిగి పరిష్కరించుకుంటున్నామని రేవంత్ తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కోసం సీబీఐ డైరెక్టర్తో పాటు కేంద్ర హోంశాఖకు ఇప్పటికే లేఖ రాశామని, అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని గుర్తు చేశారు. కాళేశ్వరంలో నీళ్లు నింపితే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పూర్తిస్థాయి స్టడీ చేయిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ కమిషన్ కేసును కూడా కేంద్రానికే అప్పగించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరిందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత కీలక మలుపులు చోటు చేసుకున్నాయని తెలిపారు. “కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? కేసీఆర్ను ఎందుకు లోపల వేయలేదు?” అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విచారించిన ఈడీ.. ఫార్ములా-ఈ రేసులో స్పష్టంగా మనీ లాండరింగ్ కనిపిస్తున్నా కేటీఆర్ను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. బీజేపీ నాయకుడి మరణంపై స్థానిక పోలీసులపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకు కూడా తాము సిద్ధమని, కేసీఆర్-కేటీఆర్లను రక్షించడానికే కిషన్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
తాజావార్తలు
-
OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు…ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
-
Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
-
India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
-
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
-
Suriya47: దీపావళి బరిలో ‘సూర్య47’?.. హ్యాట్రిక్ రిలీజ్కు స్టార్ హీరో రెడీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!