CM Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి.. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పవర్ఫుల్ కామెంట్స్..!
- చిట్చాట్లో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
- తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీకాదు
- 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి
- నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను
- నన్ను అన్నవాళ్లనే.. నేను అంటున్నా
- పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటా-సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా చిట్చాట్లో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు” అంటూ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేసిన రేవంత్, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లకే తాను బదులిస్తున్నానని స్పష్టం చేశారు. “నా మతం, నా పేరు మార్చి మాట్లాడినప్పుడు నాకు దుఃఖం ఉండదా?” అని ప్రశ్నిస్తూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలపై ఘాటుగా స్పందించారు.
iPhone 18 Pro Leaks: ఐఫోన్ 17 కంటే 5 Major Upgrades.. 2nm చిప్సెట్ అరుపులే.!
Also Read
- CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
- Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
- Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తాను ఏ రాష్ట్రంతోనూ పోల్చుకోనని, పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సహనంతో కేంద్రాన్ని అడిగి పరిష్కరించుకుంటున్నామని రేవంత్ తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కోసం సీబీఐ డైరెక్టర్తో పాటు కేంద్ర హోంశాఖకు ఇప్పటికే లేఖ రాశామని, అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని గుర్తు చేశారు. కాళేశ్వరంలో నీళ్లు నింపితే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పూర్తిస్థాయి స్టడీ చేయిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ కమిషన్ కేసును కూడా కేంద్రానికే అప్పగించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరిందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత కీలక మలుపులు చోటు చేసుకున్నాయని తెలిపారు. “కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? కేసీఆర్ను ఎందుకు లోపల వేయలేదు?” అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విచారించిన ఈడీ.. ఫార్ములా-ఈ రేసులో స్పష్టంగా మనీ లాండరింగ్ కనిపిస్తున్నా కేటీఆర్ను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. బీజేపీ నాయకుడి మరణంపై స్థానిక పోలీసులపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకు కూడా తాము సిద్ధమని, కేసీఆర్-కేటీఆర్లను రక్షించడానికే కిషన్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
తాజావార్తలు
-
Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..
-
Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
-
RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
-
AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్పై ఆసక్తికర విశ్లేషణ!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!