Bandi Sanjay: సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు.. తర్వాత చేతులెత్తేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలో బండి సంజయ్ 18వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా.. జాఫర్గడ్ క్రాస్ రోడ్డు, జఫర్గడ్ విలేజ్, అశ్వారావుపల్లి మీదుగా మీదికొండ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచనళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు. రేపటి అమిత్ షా మునుగోడు సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. మునుగోడు ప్రజలు బీజేపీవైపే ఉన్నారని, కాంగ్రెస్ పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అనంతరం మీడియా సమావేశంలో డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదని విమర్శించారు. ఉత్పత్తి సంస్థలకు నష్టం తెస్తున్నారని మండిపడ్డారు. డిస్కమ్ లకు కట్టాల్సిన బకాయిల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు. అవి బయటపెట్టండని డిమాండ్ చేశాఉ. డిస్కమ్ లకు 20 వేల కోట్లకు పైగా కట్టాలని, కానీ.. 1750 కోట్లు కట్టాలి అని వెబ్ సైట్స్ లో ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇందుకు 50 కోట్లు కేవలం బకాయిలే ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి మాత్రం మేము బకాయిలు లేదు అంటున్నారని, ఎవ్వరిని నమ్మాలని ఎద్దేవ చేశారు. 4000 కోట్ల ఆదాయం కోసం మళ్ళా కరెంట్ బిల్స్ పెంచుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిత కారణంగా సామాన్యుల పైనా భారం పడుతుందని మండిపడ్డారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
రాష్ట్ర జెన్కో కు ఉన్న అప్పులు ఎంత? మొదట చెప్పాలని ప్రశ్నించారు. కరెంట్ ఉత్పత్తి కేంద్రాల అప్పుల పైనా శ్వేతా పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మోటార్లు పెట్టాలని చెప్పినారు తప్పుడు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇవ్వద్దు అని కేంద్రం ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని బండి ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల కోసం, ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా పోయిందని బండి సంజయ్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాల బండి సంజయ్ పాదయాత్ర మొత్తం 15 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఇవాళ మీదికొండ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.
Mahesh Babu: ఫస్ట్ టైమ్.. షర్ట్ లేకుండా బాడీని చూపించిన మహేష్.. పిచ్చెక్కిపోతున్న అభిమానులు
- Tags
- bandi sanjay
- bjp
- cm kcr
- Electricity
- TRS
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!