CM KCR: కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొండగట్టుకు చేరుకొంటారని వెల్లడించారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళ స్వామి గుడి, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలిస్తారని వివరించారు. కాగా.. జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారుల, ప్రజాప్రతినిధులతో సీఎం రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..
పర్యటన షెడ్యూల్..
* ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 9.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* అక్కడి నుంచి 9.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 9.40 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని జేఎన్టీయూ చేరుకుంటారు.
* అక్కడి నుంచి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. ప్రధాన దేవాలయం, అనుబంధ ఆలయాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి జేఎన్టీయూకు బయలుదేరి అక్కడి సమావేశ మందిరంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
* మధ్యాహ్నం ఒంటి గంటకు కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొంటారు.
* అక్కడి నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రగతిభవన్కు చేరుకొంటారు.
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ డిజైన్ల రూపకర్త, ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి ఇప్పటికే రెండుసార్లు కొండగట్టు స్థలాన్ని పరిశీలించారు. గుట్ట అభివృద్ధికి నమూనా రూపొందించిన సంగతి తెలిసిందే. యాదగిరిగుట్టలో 3 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉండగా, కొండగట్టులో 12 ఎకరాల భూమి ఉంది. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తు ప్రకారం గుట్టకు ఈశాన్యం వైపు నుంచి రోడ్డు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కొత్త రోడ్డు నిర్మాణం సాధ్యం కాకపోతే ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును ఈశాన్య దిశగా మళ్లించాలని సూచించినట్లు సమాచారం. గుట్టపై 125 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్వామివారి ఆలయ విస్తరణ, దానికి సంబంధించిన అన్ని నిర్మాణాలు కృష్ణ శిలతో చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
New Zealand: న్యూజిలాండ్లో భీకర తుఫాను.. ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!