Telangana BJP: చివరి రోజు తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం.. ఎవరెవరు ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పంపడం తెరిచి ఉంటుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆపనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలకు పూర్తిగా స్వస్తి పలకనుంది. ఈ సాయంత్రం తర్వాత నేతలు, స్టార్ క్యాంపెయినర్లు మీడియాతో మాట్లాడవద్దని, మీడియా సమావేశాలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టి తెలంగాణపైనే ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3 ఆదివారం వెలువడనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్లలో ఓటింగ్ ముగిసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
Read also: Pooja Gandhi: పెళ్లి పీటలెక్కబోతున్న పూజా గాంధీ.. వరుడు ఎవరంటే?
Also Read
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగియనుంది, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హన్మకొండలో ప్రచారం చేయనున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నిజామాబాద్ అర్బన్లో ప్రచారం చేయనున్నారు. దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేటలలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేయనున్నారు. దీంతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదిలాబాద్, బోథ్, ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి తరపున ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.
బాలానగర్ కూడలి నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది. కొత్త బోయినపల్లి క్రాస్ రోడ్డు, బోయినపల్లి పీఎస్, పాత బోయినపల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట్ బస్టాప్, అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. పవన్ రోడ్ షోకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా మరోవైపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. అవసరమైన దానికంటే 25 శాతం అదనంగా ఈవీఎంలను కొనుగోలు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచే ముందు ప్రాథమిక తనిఖీలు జరిగాయి.
Shakib Al Hasan: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న బంగ్లా కెప్టెన్!
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!