Ponguleti Srinivasa Reddy: జనగర్జన సభను ఫెయిల్ చేయడానికి కుట్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ సాయంత్రం ఖమ్మంలో జరిగే జనగర్జన సభను ఫెయిల్ చేయాలని అధికార పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాల్గొంటున్నందున సభను నిర్వహించనివ్వద్దని కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుపుల్ల వేశారు.. ప్రైవేటు బస్సులను కూడా రానివ్వకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.. దీంతో ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ సభ విజయవంతం చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Read Also: Yatra 2: ఎలక్షన్స్ టార్గెట్ గా ‘యాత్ర 2’
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ముఖ్యమంత్రి ఇలాంటి చౌకబారు పనులు చేయడమేమిటని పొంగులేటి ప్రశ్నించారు. జనగర్జన సభకు ప్రైవేట్ వాహనాలు, డీసీఎంలు, ఆటోలు రానివ్వడం లేదు అని ఆయన ఆరోపించారు. 15000 వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.. ప్రభుత్వం కను సైగల్లో పని చేసే అధికారులు రోడ్లను బ్లాక్ చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల డ్రైవర్ల నుంచి సీ బుక్ లను బలవంతంగా తీసుకుంటున్నారు అని పొంగులేటి అన్నారు. రాత్రి నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.. ఇప్పటికే 1700 వాహనాలు సీజ్ చేశారన్నాడు.
Read Also: BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
సీ బుక్, ఆర్సీ బుక్ లను లాక్కొన్ని దౌర్జన్యం చేస్తున్నారు అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికార మాదంతో బీఆర్ఎస్ నేతలు స్కీం లు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడ్డారు. వెంసూర్ మండలం సర్పంచ్ ఆధ్వర్యంలో బెదిరింపులకు పాల్పడింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు కొంతమంది పింక్ కలర్ మాత్రమే తోడుక్కొలేదు.. అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. సాయంత్రం మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కాదు..
నేను భయపడడం లేదు.. నన్ను గుండెలో పెట్టుకున్న కార్యకర్తలకు, అభిమానులకు, కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. సభను విజయవంతం చేయండి.. అవసరమైతే.. ఎంత దూరం అయిన పొండి.. కొద్ది సేపట్లో నేను కూడా రోడ్ల మీదకు వస్తాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Read Also: Women Lingerie : 8నెలలుగా ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్ల దొంగతనం.. గాయపడిన 10మంది
సత్యాగ్రహ మార్గంలో ఆందోళన చేద్దాం.. బీఆర్ఎస్ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ ఉంటుందని పొంగులేటి అన్నారు. మీ దగ్గర బైక్, ట్రాక్టర్, డీసీఎం, బస్సు, కారు.. ఏదీ లేకపోతే నడుచూకుంటు అయిన వచ్చి మన పార్టీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ను ఇంటికి పంపించే ఉద్యమం ఖమ్మం గడ్డ మీద నుంచే పోరాటం చెద్దాం.. కేసీఆర్ పతనం ఈ వేదిక మీద నుంచే జరుగుతుంది.. తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే సాగింది..అదే విధంగా కేసీఆర్ పతనం ఇక్కడ నుంచే జరగాలని పొంగులేటి తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?