Hydershahkote Black Magic: హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీ మనీకోసం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. క్షుద్రపూజల పేరుతో హడావిడి చేస్తున్నారు.. దేవాలయాలు, పురాతన భవనాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పుడు స్కూళ్లను కూడా వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో క్షుద్రపూజలు జరగడం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ స్కూల్ లో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్ సైన్స్ లాబ్ తో పాటు స్టోర్ రూమ్ ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ క్షుద్రపూజల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్నారు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు. స్కూల్లోని సీసీ కెమేరాలు మాయమవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ క్షుద్రపూజలు చేసిందెవరు? దీనికి వెనుక ఎవరున్నారు అనేది దర్యాప్తులో తేలనుంది.

Also Read
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- OTR : నాంపల్లిలో SIR జరగాల్సిందేనంటున్న ఫిరోజ్ ఖాన్
ఇలాంటి క్షుద్రపూజలు దేశవ్యాప్తంగా జరుగుతూనే వున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోట్లు సంపాదించాలంటే మూఢనమ్మకాల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందంటూ బాలికను బలవంత పెట్టారు. ఇలాంటి ఘటనలు చట్టరీత్యా నేరం. అలాంటి వారిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేయవచ్చు.
Read Also: Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక
మహారాష్ట్రలో అదే జరిగింది. క్షుద్రపూజలు చేస్తే.. కనకవర్షం కురుస్తుందని నమ్మించారు.తాము చెప్పినట్లు క్షుద్రపూజలు చేస్తే కోటీశ్వరురాలివి అవుతావని ఆశపెట్టారు. దీనికోసం కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని సూచించారు. దీనికి అంగీకరించిన ఆ బాలిక క్షుద్రపూజలు చేయడానికి అంగీకరించారు. ఎక్కడో చోట ఏదో విధంగా ఈజీ మనీ పేరుతో ఇలాంటివి జరుగుతూనే వున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో పాడుబడిన భవనాల దగ్గర తవ్వకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లంకె బిందెలు వుంటాయని, మీరు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని నమ్మబలుకుతున్నారు. మంత్రాలు, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, వివిధ రకాల వస్తువులు, అస్తిపంజరాలు లభిస్తున్నాయి. రోడ్ల మీద నిమ్మకాలు దిష్టి తీసి పడేయడంతో అటుగా వెళ్ళేవారు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా వుండాలని, క్షుద్రపూజలు చేస్తే ఎలాంటి సంపద రాదంటున్నారు శాస్త్రవేత్తలు., సామాజికవేత్తలు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..