ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కంటిమీద నిద్ర లేకుండా చేస్తుంటే.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడడం కలకలంగా మారుతోంది.. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ తరహా కేసులు బయటపడ్డాయి.. తాజాగా.. ఖమ్మం జిల్లాలోనూ బ్లాక్ ఫంగస్ కేసు తీవ్ర కలకలంగా మారింది… మధిర నియోజకవర్గంలోని నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో.. ఆప్రమత్తమైన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు.. అయితే, ఇటీవల కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు భద్రయ్య.. ఆయనలో బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. వెంటనే హైదరాబాద్కు పంపించినట్టు తెలుస్తోంది.