తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును వివరించనున్నారు.
read also : వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే ?
అయితే… ఈ భేటీ స్పందించిన బండి సంజయ్… అమిత్ షాను కేవలం మార్యాదపూర్వకంగా కలవడానికి మాత్రమే ఢిల్లీ వెళ్తున్నామన్నారు.కాగా… ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన.. నేపథ్యంలో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యం అయిన సంగతి తెలిసిందే.