Parshottam Rupala: తెలంగాణలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Should Win To Achieve Development In Telangana Says Parshottam Rupala: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పైన విముఖత ఉందని తాను విన్నానని.. తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేసిందని అన్నారు. 2014 ముందు ఈ దేశంలో అవినీతి మాత్రమే ఉండేదని.. కానీ 2014 నుండి ఈ 9 సంవత్సరాల్లో ఒక్కరు కూడా అవినీతి గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాక పశువుల గురించి అనేక పధకాలు ప్రవేశపెట్టారని.. పశువుల కోసం అంబులెన్స్ ప్రవేశపెట్టిన ఘనత మోడీకే దక్కిందని చెప్పారు. దేశంలో మోడీ 4000 అంబులెన్స్లు మంజూరు చేశారని.. అంబులెన్స్తో పాటు డాక్టర్, సిబ్బంది అందరికీ కేంద్రం 60 శాతం నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు.
Bandi Sanjay: బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటి కాదు.. బిఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే!
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
కరోనా కాలంలో ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీదేనని కేంద్రమంత్రి పురుషోత్తం అన్నారు. 200 కోట్ల వ్యాక్సిన్లను అందరికి అందించారన్నారు. రైతులకు ప్రధాని మోడీ రూ.18 లక్షల కోట్ల రుణాలను ఇస్తున్నారని.. మత్స్య శాఖ వారికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ఈరోజు కాశ్మీర్లో ఒక్క కర్ఫ్యూ లేకుండా, ప్రశాంతంగా ఉందన్నారు. ఈ దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు సైతం కట్టించారన్నారు. మోడీ రాకముందే దేశంలో 100 డ్యామ్ల నిర్మాణం ఆగిపోయి ఉండేవని.. మోడీ వచ్చాక రూ.50 లక్షల కోట్ల నిధులతో 100లో 60 డ్యామ్ల పని పూర్తి అయ్యిందని తెలిపారు. ఉత్తర వాహిని గోదావరి గుజరాత్లో ఉందని, చెన్నూర్లో ఉత్తరా వాహిని గోదావరి ఉందని.. ఈ నది అభివృద్ధికి తాను కృషి చేస్తానని మాటిచ్చారు. ప్రధాని చేసిన అభివృద్ధిని ప్రజలకు తప్పక వివరించాలని సూచించారు.
CM KCR: ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి.. వారిని స్మరించుకునేందుకే అమరజ్యోతి
కరోనా కాలంలో అందరూ అల్లాడిపోతుంటే.. మోడీ లాక్డౌన్ విధించి, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారని పురుషోత్తం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 20 వేల మంది విద్యార్థులను దేశానికి రప్పించిన ఘనత మోడీదని అన్నారు. చైనా కూడా మన దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే, మోడీ దాన్ని ధైర్యంగా ఎదుర్కున్నారన్నారు. జీ20 సదస్సులో అధ్యక్షత వహించిన ఘనత మోడీకి దక్కిందని కొనియాడారు. సమర్ధవంతమైన మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని పురుషోత్తం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!