Parshottam Rupala: తెలంగాణలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలి
BJP Should Win To Achieve Development In Telangana Says Parshottam Rupala: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పైన విముఖత ఉందని తాను విన్నానని.. తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేసిందని అన్నారు. 2014 ముందు ఈ దేశంలో అవినీతి మాత్రమే ఉండేదని.. కానీ 2014 నుండి ఈ 9 సంవత్సరాల్లో ఒక్కరు కూడా అవినీతి గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాక పశువుల గురించి అనేక పధకాలు ప్రవేశపెట్టారని.. పశువుల కోసం అంబులెన్స్ ప్రవేశపెట్టిన ఘనత మోడీకే దక్కిందని చెప్పారు. దేశంలో మోడీ 4000 అంబులెన్స్లు మంజూరు చేశారని.. అంబులెన్స్తో పాటు డాక్టర్, సిబ్బంది అందరికీ కేంద్రం 60 శాతం నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు.
Bandi Sanjay: బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటి కాదు.. బిఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే!
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
కరోనా కాలంలో ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీదేనని కేంద్రమంత్రి పురుషోత్తం అన్నారు. 200 కోట్ల వ్యాక్సిన్లను అందరికి అందించారన్నారు. రైతులకు ప్రధాని మోడీ రూ.18 లక్షల కోట్ల రుణాలను ఇస్తున్నారని.. మత్స్య శాఖ వారికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ఈరోజు కాశ్మీర్లో ఒక్క కర్ఫ్యూ లేకుండా, ప్రశాంతంగా ఉందన్నారు. ఈ దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు సైతం కట్టించారన్నారు. మోడీ రాకముందే దేశంలో 100 డ్యామ్ల నిర్మాణం ఆగిపోయి ఉండేవని.. మోడీ వచ్చాక రూ.50 లక్షల కోట్ల నిధులతో 100లో 60 డ్యామ్ల పని పూర్తి అయ్యిందని తెలిపారు. ఉత్తర వాహిని గోదావరి గుజరాత్లో ఉందని, చెన్నూర్లో ఉత్తరా వాహిని గోదావరి ఉందని.. ఈ నది అభివృద్ధికి తాను కృషి చేస్తానని మాటిచ్చారు. ప్రధాని చేసిన అభివృద్ధిని ప్రజలకు తప్పక వివరించాలని సూచించారు.
CM KCR: ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి.. వారిని స్మరించుకునేందుకే అమరజ్యోతి
కరోనా కాలంలో అందరూ అల్లాడిపోతుంటే.. మోడీ లాక్డౌన్ విధించి, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారని పురుషోత్తం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 20 వేల మంది విద్యార్థులను దేశానికి రప్పించిన ఘనత మోడీదని అన్నారు. చైనా కూడా మన దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే, మోడీ దాన్ని ధైర్యంగా ఎదుర్కున్నారన్నారు. జీ20 సదస్సులో అధ్యక్షత వహించిన ఘనత మోడీకి దక్కిందని కొనియాడారు. సమర్ధవంతమైన మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని పురుషోత్తం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!