CM KCR: ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి.. వారిని స్మరించుకునేందుకే అమరజ్యోతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Speech At Telangana Martyrs Memorial: అమరవీరుల్ని స్మరించుకునేందుకే ఈ అమరజ్యోతి అని.. గుండెల్లో నిలిచే విధంగా దీనిని నిర్మించుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చాలా పెద్దదని.. ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం.. ‘జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు’ అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని.. అందులో భాగంగానే ఈ అమరజ్యోతి అని తెలిపారు. ఈ అమరజ్యోతిలో ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని.. మొత్తం అమరవీరుల ఫోటోలను ప్రదర్శిస్తామని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళులర్పించాలనే ఉద్దేశంతో.. ఈ అమరజ్యోతి ప్రారంభాన్ని ఉత్సవాల చివరి దశలో పెట్టుకున్నామని తెలియజేశారు.
Project K: ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ రివీల్.. ఫ్యాన్స్ కు పండగే ?
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
రాష్ట్రాన్ని విలీనం చేసే చేసిన తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలయ్యాయని.. నాటి రోజుల్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓ ఉద్యమ పొలికేక వచ్చిందని.. అక్కడి నుంచి మొదలుకొని 1965, 1966, 1967 నాటికి యూనివర్సిటీలకు చేరుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జీవోతో కొనసాగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఈ ఉద్యమంలో ఆసాంతం ఉన్నారన్నారు. ఎన్నో రకాల కేసులు, వేధింపులు అనుభవించిన బాధలే ఇవాళ తెలంగాణ అని ఉద్ఘాటించారు. 1969లో జరిగిన ఉద్యమం కూడా ఎంతో కీలకమైనదని.. అప్పట్లో హింస జరిగిందని.. నాటి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు మన విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా ముందుకొచ్చి.. పోరాటం చేశారని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం కొంతమంది అమరుల కుటుంబాలు ఆదుకున్నామన్న ఆయన.. ఇంకా మిగిలిన వారిని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Nellore Crime: పీఎస్లో ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో మృతి.. పోలీసుల వేధింపులే కారణమా..?
ఎవరు వచ్చినా అమరుల జ్యోతి దగ్గరకు రావాల్సిందేనని.. అంత అద్భుతంగా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారు కూడా.. అమరుల జ్యోతి చూసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇంత త్వరగా తెలంగాణ ప్రగతి జరుగుతుందని అనుకోలేదన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం.. దేశం కంటే మనదే ఎక్కువన్నారు. పంజాబ్ని తలదన్నేలా పంట సాగు జరుగుతోందన్నారు. ఓ వైపు సెక్రటేరియట్.. ఎదురుగా అమరజ్యోతి ఉందన్న ఆయన.. ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా సిద్ధం అవుతోందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!