Dr Lakshman: మోడీ వచ్చినప్పుడే.. సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుంది.. లక్ష్మణ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr Lakshman: ప్రధాని మోదీ వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపి Dr లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీరు బిర్యానీ కోసం కాకుండా మోడీ గారి ప్రసంగం కోసం ప్రజలు వచ్చి విజయవంతం చేశారని, ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కేటీఆర్ కి దిక్కు దొచడం లేదని, కల్వకుంట్ల కుటుంబం బిత్తర పోయి గాయి గత్తర చేస్తున్నారని అన్నారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలి పోయి తప్పి మతి భ్రమించి ప్రేలాపనలు చేశారని అన్నారు. ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పాలన అంతం కావాలని అంటే తెలంగాణ మా కుటుంబం అని కేటీఆర్ కామెడీ చేశారని అన్నారు. తెలంగాణ మీ కుటుంబం అయితే దళిత సీఎం ను ఎందుకు చెయ్యలేదు దళితుడు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. సీఎం, అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ, st, మహిళ కు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమ కారులు మీ కుటుంబం కాదా? మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారు..వాళ్ళు మీ కుటుంబం కాదా? పోడు భూముల పట్టాలు ఇస్తామని అధికారుల మీదకు ఉసిగొల్పి గిరిజనుల మీద దాడులు వాళ్ళు మీ కుటుంబం కాదా? నిరుద్యోగులు మీ కుటుంబ సభ్యులు కాదా? బీసీ బందు ఎస్టీ బంధు అడిగితే ఇవ్వలేదు వాళ్ళు మీ కుటుంబం కాదా? Tspsc నిర్వహించకుండా అవినీతి అక్రమాల చేసిన వారిని కాపాడుతున్నారు 30 లక్షల విద్యార్థులు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు. 6 వేల నుంచి 40 వేల కోట్ల మద్యం ఆదాయం పెంచుకున్నారని తెలిపారు. 2000 ఇచ్చి పది వేలు కొట్టేస్తున్నరని అన్నారు. అవినీతి, అమ్యమ్యలు తప్ప ఏముంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. PM వస్తే మమత బెనర్జీ లాంటి వాళ్ళు కూడా స్వాగతం పలికితే సీఎం కెసీఆర్ రాడు అంటూ మండిపడ్డారు. ప్రధాని వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ కు కెసిఆర్ తలవంపులు తెస్తున్నాడని అన్నారు. 9 ఎండ్లలో 9 లక్షల కోట్లు అభివృద్ధి కి pm నిధులు ఇస్తే కబోది లాగా సీఎం కేసీఆర్ వ్యవహారం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. పసుపు బోర్డు ద్వారా తెలంగాణ ప్రజలకు మోడీ ఎంత సాయం చేశారో తెలుసా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కూడా కెసిఆర్ సహించలేక పోతున్నాడు అని మండిపడ్డారు. రాజకీయంగా నష్ట పోతమనే భయం కెసిఆర్ కుటుంబానిది అన్నారు. వన దేవత సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఇస్తే కూడా కెసిఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. కెసిఆర్ భూమి ఇవ్వక ఆలస్యం అయ్యిందన్నారు. మోడీ పట్టుదలతో ములుగులో పెడుతున్నారని అన్నారు. కెసిఆర్ పీఠాలు కదులుతాయన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే బీజేపీ మీకు సినిమా చూపించబోతున్నదన్నారు. మీది కుల, కుటుంబ, అవినీతి పార్టీనే ముమ్మాటికీ.. Bye bye కచరా బాబాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Name Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే..
Also Read
- CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
తాజావార్తలు
-
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
-
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
-
Heatwave : అలసట, చిరాకు, నిద్రలేమి, ఒత్తిడి, చర్మ సమస్యలు.. ఇది ఎండాకాలం కాదు బాబోయ్.. రోగాల కాలం!
-
CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!