Dr Lakshman: మోడీ వచ్చినప్పుడే.. సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుంది.. లక్ష్మణ్ ఫైర్
Dr Lakshman: ప్రధాని మోదీ వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపి Dr లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీరు బిర్యానీ కోసం కాకుండా మోడీ గారి ప్రసంగం కోసం ప్రజలు వచ్చి విజయవంతం చేశారని, ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కేటీఆర్ కి దిక్కు దొచడం లేదని, కల్వకుంట్ల కుటుంబం బిత్తర పోయి గాయి గత్తర చేస్తున్నారని అన్నారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలి పోయి తప్పి మతి భ్రమించి ప్రేలాపనలు చేశారని అన్నారు. ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పాలన అంతం కావాలని అంటే తెలంగాణ మా కుటుంబం అని కేటీఆర్ కామెడీ చేశారని అన్నారు. తెలంగాణ మీ కుటుంబం అయితే దళిత సీఎం ను ఎందుకు చెయ్యలేదు దళితుడు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. సీఎం, అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ, st, మహిళ కు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమ కారులు మీ కుటుంబం కాదా? మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారు..వాళ్ళు మీ కుటుంబం కాదా? పోడు భూముల పట్టాలు ఇస్తామని అధికారుల మీదకు ఉసిగొల్పి గిరిజనుల మీద దాడులు వాళ్ళు మీ కుటుంబం కాదా? నిరుద్యోగులు మీ కుటుంబ సభ్యులు కాదా? బీసీ బందు ఎస్టీ బంధు అడిగితే ఇవ్వలేదు వాళ్ళు మీ కుటుంబం కాదా? Tspsc నిర్వహించకుండా అవినీతి అక్రమాల చేసిన వారిని కాపాడుతున్నారు 30 లక్షల విద్యార్థులు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు. 6 వేల నుంచి 40 వేల కోట్ల మద్యం ఆదాయం పెంచుకున్నారని తెలిపారు. 2000 ఇచ్చి పది వేలు కొట్టేస్తున్నరని అన్నారు. అవినీతి, అమ్యమ్యలు తప్ప ఏముంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. PM వస్తే మమత బెనర్జీ లాంటి వాళ్ళు కూడా స్వాగతం పలికితే సీఎం కెసీఆర్ రాడు అంటూ మండిపడ్డారు. ప్రధాని వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ కు కెసిఆర్ తలవంపులు తెస్తున్నాడని అన్నారు. 9 ఎండ్లలో 9 లక్షల కోట్లు అభివృద్ధి కి pm నిధులు ఇస్తే కబోది లాగా సీఎం కేసీఆర్ వ్యవహారం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. పసుపు బోర్డు ద్వారా తెలంగాణ ప్రజలకు మోడీ ఎంత సాయం చేశారో తెలుసా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కూడా కెసిఆర్ సహించలేక పోతున్నాడు అని మండిపడ్డారు. రాజకీయంగా నష్ట పోతమనే భయం కెసిఆర్ కుటుంబానిది అన్నారు. వన దేవత సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఇస్తే కూడా కెసిఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. కెసిఆర్ భూమి ఇవ్వక ఆలస్యం అయ్యిందన్నారు. మోడీ పట్టుదలతో ములుగులో పెడుతున్నారని అన్నారు. కెసిఆర్ పీఠాలు కదులుతాయన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే బీజేపీ మీకు సినిమా చూపించబోతున్నదన్నారు. మీది కుల, కుటుంబ, అవినీతి పార్టీనే ముమ్మాటికీ.. Bye bye కచరా బాబాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Name Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే..
Also Read
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
తాజావార్తలు
-
Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్..!
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?