Dr Lakshman: మోడీ వచ్చినప్పుడే.. సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుంది.. లక్ష్మణ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr Lakshman: ప్రధాని మోదీ వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపి Dr లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీరు బిర్యానీ కోసం కాకుండా మోడీ గారి ప్రసంగం కోసం ప్రజలు వచ్చి విజయవంతం చేశారని, ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కేటీఆర్ కి దిక్కు దొచడం లేదని, కల్వకుంట్ల కుటుంబం బిత్తర పోయి గాయి గత్తర చేస్తున్నారని అన్నారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలి పోయి తప్పి మతి భ్రమించి ప్రేలాపనలు చేశారని అన్నారు. ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పాలన అంతం కావాలని అంటే తెలంగాణ మా కుటుంబం అని కేటీఆర్ కామెడీ చేశారని అన్నారు. తెలంగాణ మీ కుటుంబం అయితే దళిత సీఎం ను ఎందుకు చెయ్యలేదు దళితుడు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. సీఎం, అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ, st, మహిళ కు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమ కారులు మీ కుటుంబం కాదా? మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారు..వాళ్ళు మీ కుటుంబం కాదా? పోడు భూముల పట్టాలు ఇస్తామని అధికారుల మీదకు ఉసిగొల్పి గిరిజనుల మీద దాడులు వాళ్ళు మీ కుటుంబం కాదా? నిరుద్యోగులు మీ కుటుంబ సభ్యులు కాదా? బీసీ బందు ఎస్టీ బంధు అడిగితే ఇవ్వలేదు వాళ్ళు మీ కుటుంబం కాదా? Tspsc నిర్వహించకుండా అవినీతి అక్రమాల చేసిన వారిని కాపాడుతున్నారు 30 లక్షల విద్యార్థులు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు. 6 వేల నుంచి 40 వేల కోట్ల మద్యం ఆదాయం పెంచుకున్నారని తెలిపారు. 2000 ఇచ్చి పది వేలు కొట్టేస్తున్నరని అన్నారు. అవినీతి, అమ్యమ్యలు తప్ప ఏముంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. PM వస్తే మమత బెనర్జీ లాంటి వాళ్ళు కూడా స్వాగతం పలికితే సీఎం కెసీఆర్ రాడు అంటూ మండిపడ్డారు. ప్రధాని వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ కు కెసిఆర్ తలవంపులు తెస్తున్నాడని అన్నారు. 9 ఎండ్లలో 9 లక్షల కోట్లు అభివృద్ధి కి pm నిధులు ఇస్తే కబోది లాగా సీఎం కేసీఆర్ వ్యవహారం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. పసుపు బోర్డు ద్వారా తెలంగాణ ప్రజలకు మోడీ ఎంత సాయం చేశారో తెలుసా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కూడా కెసిఆర్ సహించలేక పోతున్నాడు అని మండిపడ్డారు. రాజకీయంగా నష్ట పోతమనే భయం కెసిఆర్ కుటుంబానిది అన్నారు. వన దేవత సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఇస్తే కూడా కెసిఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. కెసిఆర్ భూమి ఇవ్వక ఆలస్యం అయ్యిందన్నారు. మోడీ పట్టుదలతో ములుగులో పెడుతున్నారని అన్నారు. కెసిఆర్ పీఠాలు కదులుతాయన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే బీజేపీ మీకు సినిమా చూపించబోతున్నదన్నారు. మీది కుల, కుటుంబ, అవినీతి పార్టీనే ముమ్మాటికీ.. Bye bye కచరా బాబాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Name Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే..
Also Read
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!