MLA Rajasingh: బీజేపీ లేకుంటే.. కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Rajasingh Warns CM KCR and TRS Leaders: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రోజురోజుకి తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న బలం చూసి టీఆర్ఎస్ వెన్నులో వణుకుపుడుతోందన్నారు. ఈటెల రాజేందర్తో పాటు ఇతర బీజేపీ నాయకులపై కొందరు టీఆర్ఎస్ నాయకులు ఏవేవో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటెల గురించి మాట్లాడే అర్హత తెరాస నాయకులకు లేదని, హుజురాబాద్లో ప్రజలు ఆమోదం తెలియజేసి ఆయన్ను గెలిపించారన్న విషయాన్ని టీఆర్ఎస్ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెరాసను వ్యతిరేకించి బయటికి రావడం వల్లే ఈరోజు ఈటెలపై నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బురద రాజకీయాలు మీరు చేస్తూ.. ఎదుటివారిని విమర్శించడం మీ నైజం అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ కుట్ర జరుగుతోందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసి.. సామాన్య మానవుడు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడని రాజాసింగ్ సెటైర్లు వేశారు. దేశమంతా బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో కూడా క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలపడుతోందని అన్నారు. బిజెపి ఎదుగుదలని ఓర్వలేకే కల్వకుంట్ల కుటుంబం ఉలిక్కి పడుతోందని.. అందుకే తమ వంది మాగధులతో అవాక్కులు, చవాక్కులు మాట్లాడిస్తున్నారన్నారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి రాష్ట్ర గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా అని ప్రశ్నించడానికి ముందు.. కెసీఆర్ ఏమైనా శాస్త్రవేత్తనా? అనే ప్రశ్న వేసుకుంటే బాగుంటుందని నిలదీశారు. రాష్ట్రంలో సమస్య ఎక్కడ ఉంటే, అక్కడ గవర్నర్ వెళ్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకుంటే మంచిదని సూచించారు. గౌరవప్రదమైన రాజ్యంగ పదవిలో ఉన్న మహిళా గవర్నర్ను గౌరవించడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నేర్చుకోవాలని కోరారు.
Also Read
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా ఉందని, పార్లమెంట్లో పెట్టిన బిల్లుకు బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న కనీస జ్ఞానం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసలు బీజేపీ లేకపోయి కేసీఆర్ సీఎం అయ్యుండేవారు కాదన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కాకుండా ఉండేవారన్న సంగతిని గుర్తంచుకోవాలన్నారు. మీ అందరి పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని మండిపడ్డ రాజాసింగ్.. బీజేపీ నాయకులపై విమర్శలు చేసేముందు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!