కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడువు.. ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదా..?
సీఎం కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడవాలని సూచించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఎన్నో హామీలు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.. హుజురాబాద్ ఎన్నికలు.. దళితుల మీద ప్రేమ, వారి అభివృద్ధి కోసమే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేసిండ్రు అని దుయ్యబట్టారు.. కేసీఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమతో కాదు అని మండిపడ్డ ఈటల.. ఈరోజు దుఃఖం లేనోడు బర్లను కొన్నట్టు దళితులకు బర్లను అప్పచెప్పారని విమర్శించారు. అసలు, హుజురాబాద్ ఉప ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదే కాదన్న ఆయన.. ఈటల రాజేందర్ రాజీనామాతోటే కేసీఆర్ దిగివచ్చారని వ్యాఖ్యానించారు.
Read Also: సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ కుట్ర.. నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారం..
ఇక, 2023 వరకు దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఈటల రాజేదర్.. 10 లక్షల స్కీమ్లో దళితులకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన.. దళిత బంధు డబ్బులు ప్రగతి భవన్ నుండి ఇస్తలేవు.. ప్రజల డబ్బులే కదా అని నిలదీశారు.. మరోవైపు కేసీఆర్, ఊరురా బెల్టు షాపులు పెట్టి ఎన్నో కుటుంబాల బతుకులు రోడ్డు మీద పడేస్తున్నాడని మండిపడ్డారు ఈటల.. ఇప్పటి కైనా కేసీఆర్ నేల మీద నడువు అని సూచించిన ఆయన.. డబల్ బెడ్ రూమ్లు నిజమైన పేదలకు ఇవ్వాలి.. కానీ, బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఈటల రాజేందర్ అమాయకుడు కాదు ఉద్యమ బిడ్డ.. కానీ, ఉప ఎన్నికలు అయిన తెల్లవారి నుండి నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కనిపిస్తలేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, సీఎం కేసీఆర్పై ప్రజలకు వ్యతిరేకత మొదలైందన్నారు ఈటల రాజేందర్.
- Tags
- bjp
- cm kcr
- Etela Rajender
- telangana
- TRS
తాజావార్తలు
-
CSK Injury Update: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?
-
Lik : ప్రదీప్ రంగనాథన్ ‘లిక్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
-
Kejriwal: దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయి.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి అన్న కేజ్రీవాల్
-
Employees Transfers: తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు.. పనిచేసిన కాలం, రిటైర్మెంట్ ఆధారంగా కీలక నిర్ణయాలు.!
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!