కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారు: విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని… కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని… తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన కేసీఆర్ .. నేడు రైతుల పై రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ కేంద్ర విధానా లను అనాలోచితంగా తప్పుబడుతున్నారన్నారు. అనవసరంగా ధర్నాలు చేస్తామనడం హస్యాస్పందగా ఉందన్నారు.
పారాబాయిల్డ్ రైస్ విషయంలో తప్ప… రా రైస్ కొనబోమని ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం గానీ, ఎఫ్సీఐ గానీ చెప్పలేదు. రా రైస్ కోసం రైస్ మిల్లర్లను సిద్ధం చేయించాల్సిన రాష్ట్ర సర్కార్… యాసంగిలో రైతులు అసలు వరి వేయవద్దంటూనే, వానాకాలం వడ్లు కల్లాలలో పోసి నెల దాటినా కొనకుండా తాత్సారం చేస్తుందన్నారు. వర్షాలకు తడిసి ధాన్యం పాడవుతున్నా కొనుగోళ్లు వేగవంతం చేయకుండా యాసంగి వడ్ల కొనుగోలుపై మళ్ళీ ధర్నా పేరుతో డ్రామాలు మొదలెడుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకో వడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన, బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
రైతు సమస్యలు ఎలాగూ పట్టని తెలంగాణ రాష్ట్ర సర్కార్… కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిల్వలుండి… అరోగ్యం విషయంలో సైతం భిన్నాభిప్రాయాలున్న పారాబాయిల్డ్ , స్టీమ్ రైస్ను అడ్డుకోకుండా కేంద్రం చూస్తోందన్నారు. హుజూరాబాద్లో ఓటమి నైరాశ్యంతో, అనవసరంగా కేంద్రాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె విమర్శించారు. దళారులతో సిండికేట్గా మారి అఫీషియల్గా బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతూ నీచ రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్కు పతనం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రైతాంగం కేసీఆర్కు ఖచ్చితంగా బద్ధి చెబుతారని విజయశాంతి వ్యాఖ్యానించారు.
- Tags
- bjp
- Farmers
- kcr
- TRS
- Vijayashanti
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!